Trisha : వీరాభిమాని మరణంతో విషాదంలో త్రిష

ఓ త్రిష అభిమాని ట్విట్టర్ లో త్రిష ఫాన్స్ పేజీని మొదలు పెట్టి దాన్ని రెగ్యులర్ గా నడిపించాడు. దాదాపు ఈ పేజీని లక్ష మంది వరకు త్రిష ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఈ పేజీతో త్రిష కూడా

Trisha :  వీరాభిమాని మరణంతో విషాదంలో త్రిష

Trisha

Trisha :  సెలబ్రిటీలు ఉన్నారంటే అందుకు కారణం అభిమానులే. ఆ విషయం వారికి కూడా తెలుసు. అభిమానులు వాళ్ళ ఫేవరేట్ హీరోలు, హీరోయిన్స్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒకప్పుడు ఫ్యాన్స్ తమ అభిమాన నటుల్ని కలవాలి అంటే చాలా కష్టం. కానీ సోషల్ మీడియా వచ్చాక ఆ దూరం కొంచెం తగ్గిందనే చెప్పొచ్చు. నటీనటులు కూడా సోషల్ మీడియాలో అభిమానులతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటున్నారు. ఇక నటీనటుల ఫ్యాన్స్ పేజెస్ కి కూడా సపోర్ట్ చేస్తూ ఆ పేజెస్ తో కాంటాక్ట్ లో ఉంటున్నారు.

Anushka Shetty : అనుష్క బరువు తగ్గడానికి వాడుతున్న చిట్కాలు ఇవే..

ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటుల కోసం సోషల్ మీడియాలో పేజీలు క్రియేట్ చేసి అభిమానుల్ని ఒక చోటికి చేరుస్తారు. ఇదే కోవలో ఓ త్రిష అభిమాని ట్విట్టర్ లో త్రిష ఫాన్స్ పేజీని మొదలు పెట్టి దాన్ని రెగ్యులర్ గా నడిపించాడు. దాదాపు ఈ పేజీని లక్ష మంది వరకు త్రిష ఫ్యాన్స్ ఫాలో అవుతున్నారు. ఈ పేజీతో త్రిష కూడా కాంటాక్ట్ ఉంటుంది.అయితే ఈ పేజీ పెట్టిన త్రిష వీరాభిమాని అయిన కిషోర్ ఇటీవల మరణించాడు.

Manchu Lakshmi : మోహన్ లాల్ సినిమాలో మంచు లక్ష్మి ఫిమేల్ లీడ్

దీంతో ఈ పేజీకి సంబంధించిన మరో వ్యక్తులు ఓ పోస్ట్ ని పెట్టి త్రిషని ట్యాగ్ చేశారు. త్రిష ఫ్యాన్ ట్విట్టర్ అకౌంట్‌ను ఈ స్థాయికి తీసుకురావడానికి కిషోర్ చాలా కృషి చేశాడు. ఎంతో మంది త్రిష అభిమానులను ఒక్క చోటకు తీసుకొచ్చాడు. అలాంటి వ్యక్తి చనిపోవడంతో త్రిష అభిమానులు విషాదంలో మునిగిపోయారు అని పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ కి త్రిష స్పందిస్తూ.. నీ మరణ వార్త విని నేను చాలా బాధపడుతున్నాను. నీ ఆత్మకు శాంతి చేకూరాలి బ్రదర్. ఇన్ని రోజులు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.