భారీ వర్షాలకు గోడ కూలి 6గురు మృతి

  • Published By: venkaiahnaidu ,Published On : October 14, 2020 / 06:28 PM IST
భారీ వర్షాలకు గోడ కూలి 6గురు మృతి

6 people died due to wall collapse మహారాష్ట్రలో విషాదం జరిగింది. పండర్పూర్​ టౌన్ లోని చంద్రభాగ నది ఒడ్డున కొత్తగా నిర్మించిన కుంభార్ ఘాట్ గోడ కుప్పకూలింది. గురువారం మధ్యాహ్నం 2:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొందరు గాయపడ్డారు.



గాయపడినవారిని ట్రీట్మెంట్ కు హాస్పిటల్ కు తరలించారు. కాగా,గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ఉద్ధృతి పెరగడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.