Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే

కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమతి లభిస్తుంది.

Republic Day Celebrations: ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు.. భద్రతా ఏర్పాట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే

Republic Day Celebrations: దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని మోదీతోపాటు, ఈజిప్ట్ అధ్యక్షుడు, ఇతర అతిథులు, కేంద్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వేల సంఖ్యలో ప్రజలు హాజరవుతారు. అందుకే ఇక్కడ భారీ భద్రత ఏర్పాటు చేస్తారు.

Tamilisai: తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తా.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం: గవర్నర్ తమిళిసై

కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా ఏర్పాట్లు ఉంటాయి. 6,000 మంది పోలీసులు, వివిధ దళాలకు చెందిన భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. క్యూఆర్ కోడ్ ఆధారంగానే ఈ వేడుకల్లో పాల్గొనే అనుమతి లభిస్తుంది. ఈ ఏడాది నుంచి క్యూఆర్ బేస్డ్ ఎంట్రీని ప్రవేశపెట్టారు. వేడుకలు జరిగే ప్రాంగణం మొత్తం 150కిపైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని ఫేసియల్ రికగ్నిషన్ ఫీచర్ ఉన్నా అడ్వాన్స్‌డ్ కెమెరాలు కూడా ఉన్నాయి. వీటితోపాటు ప్రత్యేక యాంటీ డ్రోన్ టీమ్ కూడా పని చేస్తోంది. ఢిల్లీ మొత్తం పటిష్టమైన భద్రత ఉంటుంది.

Donald Trump: ట్రంప్ ఫేస్‌బుక్, ఇన్‌స్టా అకౌంట్ల రీస్టోర్… రెండేళ్ల తర్వాత నిషేధం ఎత్తివేత

నగరంలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తారు. మార్కెట్లు, ప్రజల రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రదేశాల్లో యాంటీ-సాబొగేట్ తనిఖీలు నిర్వహిస్తారు. అంటే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్స్ వంటివి పాల్గొంటాయి. గత రెండు, మూడు నెలల ముందు నుంచే భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. నగరంలోని హోటళ్లు, ధర్మశాలలు, గెస్ట్ హౌజ్‌లు, సినిమా హాల్స్, పార్కింగ్ లాట్స్, బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్స్ వంటి అన్ని చోట్లా తనిఖీలు నిర్వహిస్తారు. సిబ్బందిని, అతిథుల్ని కూడా పరిశీలిస్తారు. పారామిలిటరీ దళాలు కూడా రంగంలోకి దిగి, భద్రతా ప్రొటోకాల్ పర్యవేక్షిస్తాయి. నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తారు.

Padma Awards 2023 : పద్మ పురస్కారాలు ప్రకటించిన కేంద్రం.. తెలుగు పద్మాలు వీరే

నగరం మొత్తం పోలీసుల పర్యవేక్షణలో ఉండేలా చూసుకుంటారు. అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపించినా, ఏదైనా కదలికను గుర్తించినా వెంటనే ప్రజలు పోలీసులకు సమాచారం అందించేలా ఆదేశాలిస్తారు. గాలిలో ఎగిరే వాటిపై కూడా నిషేధం విధిస్తారు. అంటే డ్రోన్లతోపాటు పారా గ్లైడర్స్, పారా మోటార్స్, హ్యాంగ్ గ్లైడర్స్, మైక్రోలైట్ ఎయిర్ క్రాఫ్ట్, హాట్ ఎయిర్ బెలూన్స్, చిన్న విమానాలు వంటివాటిని కూడా నిషేధిస్తారు. తీవ్రవాద కార్యకలాపాల్ని నియంత్రించే చర్యలు తీసుకుంటారు. ఇన్ని జాగ్రత్తల మధ్య ఢిల్లీలో స్వాతంత్ర, గణతంత్ర వేడుకల్ని నిర్వహిస్తారు.