Bharat Jodo Yatra: పంజాబ్లో కొనసాగుతున్న రాహుల్ భారత్ జోడో యాత్ర
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. భారత్ జోడోయాత్రలో పాల్గొంటున్న సమయంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ లోని జలంధర్ నియోజక వర్గ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మొన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ జోడో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
Bharat Jodo Yatra: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీతో నిర్వహిస్తున్న భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. భారత్ జోడోయాత్రలో పాల్గొంటున్న సమయంలో కాంగ్రెస్ నేత, పంజాబ్ లోని జలంధర్ నియోజక వర్గ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరి మొన్న గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. దీంతో భారత్ జోడో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
నిన్న ఆ యాత్రను పంజాబ్ లోని ఖల్సా కాలేజ్ గ్రౌండ్ నుంచి ప్రారంభించారు. ఇందులో దివంగత గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి బాలకౌర్ పాల్గొన్నారు. అలాగే, స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ బంధువు, ఆర్మీ మాజీ అధికారి మేజర్ జనరల్ జనరల్ షియోనన్ సింగ్ రాహుల్ తో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇవాళ అదంపూర్ నుంచి ఉర్మార్ తాండా, అనంతరం జలంధర్ నుంచి హొషియార్పూర్ కు పాదయాత్ర చేయనున్నారు.
రాహుల్ తో కలిసి వందలాది మంది ప్రజలు ఈ యాత్రలో నడుస్తున్నారు. పాదయాత్రలో భాగంగా రాహుల్ గాంధీని రైతు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలతో పాటు ప్రముఖులు కలుస్తున్నారు. రాహుల్ గాంధీ పాదయాత్ర చివరి దశకు చేరుకుంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన పాద్రయాత్ర చేస్తున్నారు.