అంత్యక్రియల్లో ట్విస్ట్..చనిపోయిన వ్యక్తి నీళ్లు తాగాడంటున్న కుటుంబసభ్యులు..చివరకు

  • Published By: madhu ,Published On : July 26, 2020 / 06:20 AM IST
అంత్యక్రియల్లో ట్విస్ట్..చనిపోయిన వ్యక్తి నీళ్లు తాగాడంటున్న కుటుంబసభ్యులు..చివరకు

ఓ వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహానికి చివరిసారిగా జరగాల్సిన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..కుటుంబంలోని ఓ వ్యక్తి..చనిపోయిన వ్యక్తి నోట్లో నీళ్లు పోశాడు. ఆ నీళ్లు తాగినట్లు ఓ వ్యక్తి గుర్తించాడు.

ఇదే విషయాన్ని అందరికీ తెలియచేశాడు. అందరిలో కలవరం. వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. మనిషి బతికి లేడని, చనిపోయాడని చెప్పడంతో మరలా..అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలో చోటు చేసుకుంది.

హుబ్లీలోని ధర్వాడ ప్రాంతంలో ఇరానా కాంబ్లే నివాసం ఉంటున్నాడు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. చికిత్స పొందుతున్న కాంబ్లే..2020, జులై 24వ తేదీ శుక్రవారం గుండెపోటుతో చనిపోయాడు. డెడ్ బాడీని కుటుంబసభ్యులకు అప్పగించారు.

అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మృతదేహానికి స్నానం చేయిస్తున్నారు. ఓ బంధువు నోట్లో పెట్టిన నీటిని తాగినట్లు గుర్తించాడు. కాంబ్లే బతికి ఉండవచ్చునని భావించారు. ధార్వాడ్ లోని జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి…ఆయన మరణించారని చెప్పారు. దీంతో మరల మృతదేహాన్ని గ్రామానికి తీసుకెళ్లారు.