Gyanvapi Temple: కాశీలో ప్రతిదీ పరమ శివుడికి చెందినదే: కేంద్ర మంత్రి
వారణాసిలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆ పరమ శివుడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు.

Gyanvapi Temple: వారణాసిలో ప్రతి వస్తువు, ప్రతి అంశము ఆ పరమ శివుడికి చెందినదేనని కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అన్నారు. గత కొన్ని రోజులుగా వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సర్వే వ్యవహారంపై కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ స్పందించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న బఘేల్..ఈ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పవారు కాదని, ప్రభుత్వం, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం ఉందని కేంద్రమంత్రి అన్నారు. పరమశివుడు కాశీని స్థాపించాడని మరియు అక్కడ ఉన్నదంతా శివుడికే చెందుతుందని ఎస్పీ సింగ్ బఘేల్ వ్యాఖ్యానించారు. “ఒక కౌలుదారు ఏ దావాలోనైనా కోర్టును తప్పుదారి పట్టించవచ్చు, కానీ చివరికి, న్యాయం భూస్వామికి అనుకూలంగా వస్తుంది” అని బఘేల్ చెప్పారు. మరోవైపు జ్ఞానవాపి కేసులో విచారణను మేజిస్ట్రేట్ మే 26కు వాయిదా వేశారు.
Other Stories:Gyanvapi Mosque: జ్ఞానవాపి కేసులో విచారణ వాయిదా.. ఎల్లుండి ముస్లిం పిటిషనర్ల వాదనలకు చాన్స్
హిందూ వర్గాల వైపు పిటిషన్ ను తిరస్కరించాలన్న ముస్లిం వర్గాల వాదనను మే 26న వినిపించాలని కోర్టు సూచించింది. జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో కోర్టు తప్పనిసరి చేసిన వీడియోగ్రఫీ సర్వే నివేదికపై అభ్యంతరాలను దాఖలు చేయడానికి హిందూ మరియు ముస్లిం పక్షాలకు కోర్టు ఒక వారం సమయం ఇచ్చిందని జిల్లా ప్రభుత్వ న్యాయవాది రాణా సంజీవ్ సింగ్ చెప్పారు. జ్ఞానవాపి – శృంగార్ గౌరీ ప్రాంగణంలో మసీదు ఏర్పాటు చేశారని..మసీదు ఉన్నా..అక్కడ ఉన్న హిందూ దేవతల విగ్రహాలకు నిత్యా పూజలు చేసేలా కోర్టు అనుమతి ఇవ్వాలని ఢిల్లీకి చెందిన నలుగురు హిందూ మహిళలు వారణాసి జిల్లా కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు మసీదు ప్రాంగణంలో సర్వేకు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అన్నీ అవాంతరాలు దాటుకుని జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో వీడియో సర్వే నిర్వహిస్తున్న సమయంలో మసీదులో శివ లింగం బయటపడడం ఈ ఘటన కొత్త మలుపు తీసుకుంది.
- Wheat Exports: గోధుమల దిగుమతి కోసం భారత్ను సంప్రదిస్తున్న అనేక దేశాలు
- PM Modi: భారతీయులు సిగ్గుతో తలలు వంచుకునేలా ఎలాంటి పని చేయలేదు: ప్రధాని మోదీ
- Wild elephant kills Woman: మహిళను తొక్కి చంపిన ఏనుగు: తమిళనాడులో రెండు రోజుల్లో రెండు ఘటనలు
- Aadhar Card: మీ ఆధార్ కార్డుకు ఎన్ని ఫోన్నెంబర్లు లింక్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు
- K S Eshwarappa: మసీదులుగా మార్చిన మొత్తం 36 వేల దేవాలయాలను తిరిగి స్వాధీనం చేసుకుంటాం: కర్ణాటక మాజీ మంత్రి
1World’s Ugliest Dog : ప్రపంచంలో అత్యంత అందవిహీనమైన కుక్క ఇదే.. రూ.లక్ష గెలుచుకుంది
2GPF Money : అసలేం జరిగింది? ఉద్యోగుల GPF ఖాతాల నుంచి రూ.800కోట్ల డబ్బు మాయం
3Udaipur incident: ఊహకు అందని ఘటన జరిగింది.. మోదీ, షా స్పందించాలి: రాజస్థాన్ సీఎం
4Elon Musk : మస్క్ ఫాలోయింగ్ మామూలుగా లేదుగా.. బిలియనీర్ బర్త్డే రోజున ట్విట్టర్ ఫాలోవర్లు ఎంతంటే?
5Telangana Covid Bulletin : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే
6Period Tracking Apps : అమెరికాలో మహిళలు.. ఫోన్లలో పీరియడ్ ట్రాకింగ్ యాప్స్ డిలీట్ చేస్తున్నారు.. ఎందుకంటే?
7Dharmendra Pradhan: అప్పటివరకు బిహార్ సీఎంగా నితీశ్ కుమారే..: ధర్మేంద్ర ప్రధాన్
8Srinivasa Klayanam : సెయింట్ లూయిస్లో అంగరంగ వైభవంగా శ్రీవారి కల్యాణం
9Moto G42 India : మోటో G42 లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు, ధర ఎంతంటే?
10prophet row: రాజస్థాన్లో తీవ్ర కలకలం.. హింసాత్మక ఘటనలు.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత
-
Google Hangouts : వచ్చే నవంబర్లో హ్యాంగౌట్స్ షట్డౌన్.. గూగుల్ చాట్కు మారిపోండి..!
-
Pakka Commercial: పక్కా కమర్షియల్ సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ ఎంతంటే?
-
Lokesh Kanagaraj: విజయ్ కోసం మకాం అక్కడికి మారుస్తున్న లోకేశ్..?
-
Tesla Employees : టెస్లా ఉద్యోగుల కష్టాలు.. ఆఫీసుకు రావాల్సిందే.. వస్తే కూర్చొనేందుకు కుర్చీలు కూడా లేవట..!
-
Loan Apps : లోన్ యాప్స్ కేసుల్లో కొత్త కోణం..అడగకపోయినా అకౌంట్లలో డబ్బులు జమ
-
Train Crash : అమెరికాలో ఘోర రైలు ప్రమాదం..ముగ్గురి మృతి
-
Flying Hotel : ఎగిరే హోటల్..ఆకాశంలో తేలియాడుతూ భోజనం చేయొచ్చు!
-
Justice Ujjal Bhuyan : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్