Madhya Pradesh : మూడో భార్య చెప్పిందని.. మొదటి భార్య కొడుకును హత్య చేసిన వ్యక్తి

పాయల్ ప్రతీక్ ను నిత్యం కొడుతూ, తిడుతూ వేధిస్తూవుండేది. ఇదే విషయంపై మూడో భార్య, శశిపాల్ మధ్య ఎల్లప్పుడూ ఘర్షణలు జరుగుతుండేవి.

Madhya Pradesh : మూడో భార్య చెప్పిందని.. మొదటి భార్య కొడుకును హత్య చేసిన వ్యక్తి

Father Killed Son

Father Killed Son : మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే కొడుకును కడతేర్చాడు. మూడో భార్య చెప్పిందని మొదటి భార్య కొడుకును హత్య చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండోర్ కు చెందిన శశిపాల్ అనే వ్యక్తి మొదటి భార్యకు ఒక కొడుకు ఉన్నాడు. అతనికి ప్రతీక్ అని పేరు పెట్టారు.

అయితే, కొద్ది రోజులకే ప్రతీక్ తల్లి మరణించడంతో తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. కానీ, భర్తతో గొడవ పడి వదిలేసి వెళ్లి పోయింది. దీంతో శశిపాల్ పాయల్ అనే మహిళను మూడో వివాహం చేసుకున్నారు. అయితే పాయల్ ప్రతీక్ ను నిత్యం కొడుతూ, తిడుతూ వేధిస్తూవుండేది. ఇదే విషయంపై మూడో భార్య, శశిపాల్ మధ్య ఎల్లప్పుడూ ఘర్షణలు జరుగుతుండేవి.

Extra Marital Affair : అక్రమ సంబంధం తెలిసి పోయిందని కొడుకు హత్య

ఈ నేపథ్యంలోనే  మూడో భార్య పాయల్ డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లింది. రెండు నెలల క్రితం బాలుడికి జన్మనిచ్చింది. ఈ నేపథ్యంలో శశిపాల్ భార్యను తీసుకొచ్చేందుకు అత్తారింటికి వెళ్లగా పాయల్ నిరాకరించారు.ప్రతీక్ ను ఇంటికి దూరంగా పంపిస్తే లేకపోతే చంపేస్తేనే తాను వస్తానని లేదంటే పుట్టింట్లోనే ఉంటానని తేల్చి చెప్పారు.

దీంతో తిరిగి తన ఇంటికి వచ్చిన శశిపాల్ కొడుకును ప్రతీక్ ను పిలిచి రాత్రికి తన ఏసీ గదిలోనే పడుకోమని తెలిపారు. నిజానికి తన తల్లి చనిపోయినప్పటి నుంచి ప్రతీక్ తాత, నానమ్మలతో కలిసి పడుకునేవాడు. కానీ, ఎప్పుడూ దగ్గరికి తీయని తండ్రి ప్రేమగా పిలిచి మరీ ఏసీ గదిలో పడుకోమని చెప్పడంతో కొడుకు మురిసిపోయాడు. అదే విషయాన్ని తాత, నానమ్మలతో సంతోషంగా చెప్పి తండ్రి గదిలోకి వెళ్లాడు.

Illicit Affair : ప్రియుడి మోజులో కన్న కొడుకు హత్య

మనుమడు ప్రతీక్ ను వాళ్లు ప్రాణాలతో చూడడం అదే చివరిసారి అయింది. తండ్రిని నమ్మిన కొడుకు అతని పక్కనే హాయిగా నిద్రపోయాడు. ప్రతీక్ నిద్రపోగానే టీవీ సౌండ్ పెంచిన తండ్రి శశిపాల్ కొడుకు గొంతు నులిమి హత్య చేశాడు. హత్యకు ముందు మూడో భార్యకు వీడియో కాల్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదు. దీంతో హత్య అనంతరం వీడియో తీసి మూడో భార్య పాయల్ కు వాట్సాప్ చేశాడు.

అయితే, అప్పటికే ఆమె శశిపాల్ నెంబర్ ను బ్లాక్ చేసి ఉండటంతో ఆ వీడియో ఆమెకు చేరలేదు. ఆ తర్వాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున మనవడిని విగతజీవిగా చూసిన తాత, నానమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. శశిపాల్, అతడి మూడో భార్య పాయల్ అరెస్టు చేశారు.

Uttar Pradesh : కన్న కొడుకును హత్య చేసిన తల్లి .. సినిమా స్టైల్లో ప్రతీకారం తీర్చుకున్న తండ్రి

శశిపాల్ మీడియాతో మాట్లాడుతూ తన భార్యకు తన కొడుకుతో ఎప్పుడూ సమస్యే ఉండేదని, ఇప్పుడు అతడిని చంపేశానని ఇక అతడితో ఆమెకు ఎలాంటి సమస్యలు ఉండదని తెలిపారు. కాగా, ప్రతీక్ ను చంపమని తాను ఎన్నడూ చెప్పలేదని, తన భర్త అబద్ధం చెబుతున్నారని మూడో భార్య పాయల్ తెలిపారు.