UP Polls : యోగి సర్కార్ వరాలు.. వచ్చేవారం నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు పంపిణీ..!

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు యోగి సర్కార్‌ ముందుగానే వరాలు కురిపిస్తోంది. ఈసారి యువతని టార్గెట్ చేసింది.

UP Polls : యోగి సర్కార్ వరాలు.. వచ్చేవారం నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లెట్లు పంపిణీ..!

Free Smartphones, Tablets For Up Students From Next Week

UP Polls : వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు యోగి సర్కార్‌ ముందుగానే వరాలు కురిపిస్తోంది. ఈసారి యువతని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే యువతకు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్‌ ఫోన్లు ఇవ్వాలని భావిస్తోంది. డిసెంబర్ రెండో వారం నుంచి విద్యార్థులకు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేసేందుకు యూపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ‘DG Shakti’ అనే ప్రత్యేక పోర్టల్‌ను
రూపొందించారు. త్వరలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ పోర్టల్ ప్రారంభించనున్నారు.

ఈ పోర్టల్ ద్వారా విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లు పంపిణీ చేయడంతోపాటు కంటెంట్‌ను అందజేస్తారు. అలాగే స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్‌లకు సంబంధించిన సమాచారాన్ని విద్యార్థులకు వారి మొబైల్ నంబర్లు, మెయిల్ ఐడీల్లో ఎప్పటికప్పుడు అందజేయనున్నారు. విద్యార్థులకు పంపిణీ చేయబోయే ఉచిత స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌ల కోసం వారు ఎక్కడికి వెళ్లి నమోదు చేసుకోవలసిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ నుంచి స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్స్ డెలివరీ వరకు మొత్తం ఉచితంగా యోగి సర్కార్ అందించనుంది. విద్యార్థుల డేటాను కాలేజీల వారీగా యూనివర్సిటీ నుంచి అందజేయనున్నారు.

విద్యార్థుల డేటా ఫీడింగ్ యూనివర్సిటీ స్థాయిలోనే జరుగుతోంది. సోమవారం వరకు దాదాపు 27 లక్షల మంది విద్యార్థుల డేటాను పోర్టల్‌లో అప్‌లోడ్ చేశారు. మిగిలిన ఇతర విద్యార్థుల డేటా ఫీడింగ్ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ల కొనుగోలు కోసం ప్రభుత్వం GeM పోర్టల్‌లో రూ. 4,700 కోట్ల విలువైన టెండర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే పలు కంపెనీలు స్మార్ట్‌ఫోన్‌లు, ట్యాబ్లెట్ల కోసం టెండర్లు వేయగా.. తుది దశలో ఉన్నట్టు తెలుస్తోంది.

సాంకేతిక పరిశీలన తర్వాత అర్హత కలిగిన సంస్థల ఫైనాన్షియల్ బిడ్‌లు ఓపెన్ చేస్తారు. డిసెంబర్‌ మొదటి వారంలోగా వర్క్‌ ఆర్డర్‌ వచ్చే అవకాశం ఉంది. టెండర్‌లో ఎంపికైన కంపెనీలు మొదటి లాట్‌లో కనీసం 2.5 లక్షల ట్యాబ్లెట్లను సరఫరా చేయాల్సి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కోసం ఎంపిక చేసిన కంపెనీలు మొదటగా కనీసం ఐదు లక్షల స్మార్ట్‌ఫోన్‌లను సరఫరా చేయాల్సి ఉంటుంది.

Read Also : AP Government : సిరివెన్నెల కుటుంబానికి ఏపీ సర్కార్ సాయం