Fraud: కిలాడీ లేడి..పెళ్లి చేసుకుంటానని చెప్పి 30 లక్షలకు టోకరా..

పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.30 లక్షలు కాజేసింది యువతి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యశవంతపురలో చోటుచేసుకుంది. అనంత్ మల్య అనే వ్యక్తికి 2019లో బెంగళూరుకు చెందిన ఓ యువతి పరిచయమైంది.

Fraud: కిలాడీ లేడి..పెళ్లి చేసుకుంటానని చెప్పి 30 లక్షలకు టోకరా..

Fraud

Fraud: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఏకంగా రూ.30 లక్షలు కాజేసింది యువతి. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం యశవంతపురలో చోటుచేసుకుంది. అనంత్ మల్య అనే వ్యక్తికి 2019లో బెంగళూరుకు చెందిన ఓ యువతి పరిచయమైంది. కొంతకాలానికి ఇద్దరిమధ్య ప్రేమ చిగురించింది. పెళ్లంటే చూసుకుంటే నిన్నే చేసుకుంటానని మాయమాటలు చెప్పి అనంత్ మల్య నుంచి రూ. 30 లక్షలు వరకు తీసుకుంది.

మల్యకు డబ్బు అవసరం రావడంతో తన డబ్బు ఇవ్వాలంటూ సదరు యువతిని పలుమార్లు అడిగాడు.. ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అంటూ దాటవేసేది. అయితే గత కొద్దీ రోజులుగా ఆమె కనిపించడం లేదు.. ఫోన్ చేసినా తీయడం లేదు. దీంతో మోసపోయానని భావించిన బాధితుడు అనంత్ మల్య యశవంతపుర పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.