ఆరు రోజుల పసిగుడ్డును కాలితో తొక్కి చంపేసిన కసాయి తండ్రి

  • Published By: nagamani ,Published On : October 1, 2020 / 01:28 PM IST
ఆరు రోజుల పసిగుడ్డును కాలితో తొక్కి చంపేసిన కసాయి తండ్రి

Haryana: కేవలం ఆరు రోజుల పసిగుడ్డును కన్నతండ్రే కాలితోతొక్కి చంపేశాడు. పుట్టి పట్టుమని పది రోజులుకూడా కాకుండా నూరేళ్ల బిడ్డ ప్రాణాన్ని నిలువునా తీసేశాడా కసాయితండ్రి. బిడ్డ పక్కన పడుకుని అదను చూసి పసిబిడ్డ పీకపై కాలు వేసి తొక్కి చంపేసిన ఘటన హర్యానా రాష్ట్రంలోని యమునానగర్ లో చోటుచేసుకుంది.


వివరాల్లోకి వెళితే హర్యానాలోని యమునానగర్ ప్రాంతంలోని మజ్రా ప్రాంతంలో ఓ అద్దె ఇంట్లో నీరస్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. 2015లో నీరజ్ కు వర్ష అనే యువతితో వివాహం అయ్యింది. కానీ పెళ్లై 5 సంవత్సారాలు గడిచినా భార్యకు గర్భం దాల్చకపోటంతో తమకు పిల్లలు పుట్టరేమోనని దిగులుచెందేవారు భార్యాభర్తలిద్దరూ. కానీ వారి ఆశలు ఫలించి నీరజ్ భార్య గర్భవతి అయ్యింది. నెలలు నిండాయి. గత సెప్టెంబర్ 24,2020న పడంటి ఆడబిడ్డ పుట్టింది. ఐదు సంవత్సరాలకు తమ కలలు పండి బిడ్డ పుట్టింది.


తాము అమ్మానాన్నలమయ్యామని నీరజ్ ఆనందపడలేదు. కారణం పుట్టింది ఆడపిల్ల కాబట్టి. నీరజ్ కు ఆ పిల్లను చూసినప్పుడల్లా తమకు మగపిల్లాడు పుడితే ఎంత బాగుండి ఈ ఆడపిల్ల పుట్టింది శని అంటూ తెగ మదనపడిపోయేవాడు. చిరాకు పడేవాడు. కానీపైకి తెలియనిచ్చేవాడు కాదు. అసలే మద్యం తాగే అలవాటు ఉన్న నీరజ్ గత తాగి ఇంటికొచ్చాడు. మంచంపై హాయిగా నిద్రపోతున్న కూతురు పక్కనే పడుకున్నాడు.ఆ పిల్లను చూసిన నీరజ్ కు ఉక్రోషం వచ్చింది. మగపిల్లాడు పుట్టకుండా నువ్వు పుట్టావు..అంటూ ఆ ఆరురోజుల పసిబిడ్డ పీకపై కాలు వేసి తొక్కి చంపేశాడు.


ఇది గమనించిన నీరజ్ భార్య వర్ష ఏడుస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న యమునానగర్ పోలీస్లు నీరజ్ ను అరెస్ట్ చేసి బుధవారం కోర్టులో హాజరుపరాచామని పోలీసులు తెలిపారు.