బెంగాల్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్..మహిళలకు 33శాతం రిజర్వేషన్లు,కేజీ టు పీజీ ఉచిత విద్య

lపశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేశారు. ఆదివారం కోల్ కతాలోని పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్,బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి కైలాష్ వర్గీయ సహా పలువరు బీజేపీ నేతలు పాల్గొన్నారు.

బెంగాల్ బీజేపీ మేనిఫెస్టో రిలీజ్..మహిళలకు 33శాతం రిజర్వేషన్లు,కేజీ టు పీజీ ఉచిత విద్య

Home Minister Amit Shah Releases Bjps Manifesto For Westbengal Election2021

West Bengalపశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మ్యానిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా విడుదల చేశారు. ఆదివారం కోల్ కతాలోని పార్టీ ఆఫీసులో జరిగిన ఈ కార్యక్రమంలో బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్,బెంగాల్ బీజేపీ వ్యవహారాల ఇన్ ఛార్జి కైలాష్ వర్గీయ సహా పలువరు బీజేపీ నేతలు పాల్గొన్నారు. తమ మేనిషెస్టోని “సంకల్ప్ పత్ర”గా పిలవాలని తాము నిర్ణయించామని ఈ సందర్భంగా అమిత్ షా తెలిపారు. ఇది కేవలం మేనిఫెస్టో కాదని..బెంగాల్ కి దేశంలోని అతిపెద్ద పార్టీ రాసే మార్పు లేఖ అని అన్నారు.

మహిళలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని అమిత్ షా తెలిపారు. కేజీ నుంచి పీజీ వరకు మహిళలకు ఉచిత విద్య అందిస్తామన్నారు. బెంగాల్ లోకి చొరబాటుదారులను అనుమతించకూడదని తాము నిర్ణయించామన్నారు. సరిహద్దు ఫెన్సింగ్ ను బలోపేతం చేస్తామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనని కొనసాగిస్తామని, గత మూడేళ్లుగా రైతులకు మమత ప్రభుత్వం ఇవ్వని రూ.18,000 75లక్షల రైతులు నేరుగా ఎలాంటి కోతలు లేకుండా అకౌంట్లలో జమ చేస్తామన్నారు. మెదటి కేబినెట్ లోనే సీఏఏని అమలుపై నిర్ణయం చేస్తామన్నారు. 70ఏళ్లుగా ఇక్కడే ఉంటున్న శరణార్థులకు పౌరసత్వం ఇస్తామన్నారు. 5ఏళ్ల పాటు ఏటా రూ.10,000చొప్పున ఒక్కో శరణార్థి కుటుంబానికి ఇస్తామని అమిత్ షా తెలిపారు.

ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ మరియు సుందర్భాన్ లో మూడు కొత్త ఎయిమ్స్ హాస్పిటల్స్ నిర్మిస్తామన్నారు. దీని వల్ల మెరుగైన వైద్య సదుపాయం కోసం స్థానికులు కోల్ కతాకి ప్రయాణించాల్సిన అవసరం ఉండదని హోంమంత్రి తెలిపారు. అవినీతిని పరిక్షిస్తుండేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కామన్ ఎలిజిబులిటీ టెస్ట్(CET)ప్రారంభిస్తామన్నారు. ఆయుధాల రాకెట్టు, తనిఖీ చేయని మాదకద్రవ్యాల వ్యాపారం, భూ కబ్జా, నకిలీ కరెన్సీ సర్క్యులేషన్ మరియు పశువుల అక్రమ రవాణా సమస్యలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. కళ, సాహిత్యం మరియు ఇతర రంగాలను ప్రోత్సహించేందకు రూ. 11,000 కోట్ల విలువైన సోనార్ బంగ్లా నిధిని ఏర్పాటు చేస్తామన్నారు.

రాజకీయ హత్యల కేసులను దర్యాప్తు చేయడానికి మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింసకు గురైన ప్రతి ఒక్క భాధితులకి పునరావాస ప్యాకేజీగా రూ .25 లక్షల వరకు అందిస్తామన్నారు. ఐక్యరాజ్యసమితిలో బెంగాలీని అధికారిక భాషలలో ఒకటిగా మార్చడానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు చేస్తామన్నారు. కృషక్​ సురక్ష యోజన కింద భూమిలేని రైతులకు రూ.4,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు.