Aziz Qureshi : బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగ మార్పు ఖాయం..ఓవైసీ-బీజేపీ కలిసి..

యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు. 2024లో గెలిచి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కేంద్రంలో తిరిగి అధికారంలోకి వ‌స్తే బీజేపీ.. రాజ్యాంగాన్ని మార్చేస్తుందని,దేశాన్ని

Aziz Qureshi : బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగ మార్పు ఖాయం..ఓవైసీ-బీజేపీ కలిసి..

Qureshi2

Aziz Qureshi: యూపీ మాజీ గవర్నర్ అజీజ్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు. 2024లో గెలిచి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కేంద్రంలో తిరిగి అధికారంలోకి వ‌స్తే బీజేపీ.. రాజ్యాంగాన్ని మార్చేస్తుందని,దేశాన్ని భ్రష్ఠుపట్టిస్తుందని అజీజ్ ఖురేషి ఆదివారం వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని… అందుకే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటుందన్నారు. 2024లో మళ్లీ దేశంలో మోదీ ప్రభుత్వం ఏర్పడితే దేశంలో ఏమీ మిగలదని, అప్పటికి దేశమంతా అమ్ముడుపోతుందని, బీజేపీ నుంచి దేశాన్ని రక్షించాలన్నారు.

ఈ దేశాన్ని కాపాడాలంటే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల‌ని, బీజేపీని ఓడించాల‌ని పిలుపు ఇచ్చారు. ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి బీజేపీని ఓడించాలని అజీజ్ ఖురేషీ కోరారు. గత నెల రోజులుగా తాను ఈ ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు అజీజ్ ఖురేషీ తెలిపారు. ముస్లింలకు బీజేపీ పెద్ద శత్రువని, సమాజాన్ని నాశనం చేసేందుకు బీజేపీ పనిచేస్తోందని ఖురేషీ అన్నారు. ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంసీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ముస్లింలకు పెద్ద శత్రువు అని ఖురేషీ అన్నారు. బీజేపీకి సహకరిస్తూ ముస్లిం వర్గాన్ని ఒవైసీ నాశనం చేస్తున్నారన్నారు. ఓవైసీ బీజేపీ ఏజెంట్ అన్నారు. ఒవైసీ పార్టీ బీహార్ ఎన్నికల్లో పోటీ చేయకుంటే బీజేపీ ఎప్పటికీ అక్కడికి వచ్చేది కాదన్నారు. బీజేపీ, ఒవైసీలు సహచరులు. వీరిద్దరూ కలిసి ముస్లింలను నాశనం చేస్తున్నారని ఖురేషీ అన్నారు.

ఇక,మదర్సాల నుంచే ఉగ్రవాదులు బయటకు వస్తారని, మదర్సాలలో తీవ్రవాదం బోధించబడుతుందంటూ ఉత్తరప్రదేశ్ మంత్రి రఘురాజ్ సింగ్ వ్యాఖ్యలపై ఖురేషీ స్పందిస్తూ..ఆయనను తప్పుదోవ పట్టించారని అన్నారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు పెద్ద పాత్ర పోషించారని, బ్రిటీష్‌వారిని దేశం నుంచి తరిమికొట్టాలని మొట్టమొదట వాయిస్ వినిపించింది మదర్సాల నుంచేనని ఖురేషి అన్నారు.

ALSO READ Shashi Tharoor : మహిళా ఎంపీలతో శశి థరూర్ సెల్ఫీ..నెటిజన్ల విమర్శలతో క్షమాపణ