Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్తాన్ లో

దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Omicron Death : భారత్ లో తొలి ఒమిక్రాన్ మరణం రాజస్తాన్ లో

Omicron

Omicron Death : దేశంలో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైంది. రాజస్తాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ లో దేశపు తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు బుధవారం కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మృతిచెందిన వ్యక్తి పేరు లక్ష్మీ నారాయణ(73)అని తెలిపారు. డిసెంబర్-15న అతడికి కరోనా పాజిటివ్ గా తేలిందని..అప్పటి నుంచి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నాడని తెలిపారు.

అతడి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపారని, ఇదే సమయంలో డిసెంబర్-21న అతడికి కోవిడ్ నెగిటివ్ గా తేలినట్లు చెప్పారు. డిసెంబర్-25న జీనోమ్ సీక్వెన్సింగ్ ఫలితాలు వచ్చాయని,ఆ రిపోర్ట్ లో లక్ష్మీనారాయణకి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని తెలిపారు. అయితే ఈ టెస్ట్ ఫలితాలు వచ్చిన ఆరు రోజుల తర్వాత డిసెంబర్-31న ఉదయం 3:30గంటల సమయంలో లక్ష్మీ నారాయణ మృతి చెందినట్లు తెలిపారు.

అయితే లక్ష్మీనారాయణ కి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని,రెండు డోసుల కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్నాడని తెలిపారు. లక్ష్మీ నారాయణకి డయాబెటిస్,హైపర్ టెన్షన్ వంటి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం.

ALSO READ Home Isolation : హోం ఐసొలేషన్ కి కేంద్రం కొత్త గైడ్ లైన్స్