Kashmir : ఉగ్రదాడిలో ఆర్మీ అధికారి.. జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.
Kashmir : జమ్ముకశ్మీర్ ఫూంచ్ జిల్లాలో గురువారం జరిగిన కౌంటర్ టెర్రర్ ఆపరేషన్ చర్యల్లో భాగంగా, భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఆర్మీ అధికారితో పాటు ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో గాలింపు చేపట్టిన భద్రతా బలగాలపై ఒక్కసారిగా కాల్పులు జరిపారు ముష్కరులు.. దీంతో ఇద్దరు ఆర్మీ అధికారితో పాటు ఓ సైనికుడు వీరమరణం పొందారు.
చదవండి : Jammu Kashmir: ఎన్కౌంటర్లతో అట్టుడుకుతున్న కశ్మీర్
కాగా నాలుగు రోజుల క్రితం ఉగ్రవాదులు ఉగ్రవాదులు జరిపిన కాల్పులలో ఐదుగురు సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే.. క్రమంలో బుధవారం సాయంత్రం ఫూంచ్ – రాజౌరీ రహదారిని మూసేశారు. ఆ మార్గంలో ఉన్న దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు తలదాచుకున్నారు. ఇక్కడే అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్..30 గంటల వ్యవధిలో 5 ఎన్కౌంటర్లు