Madhya Pradesh : హోలీ పండుగ రోజు..మందు దొరక్క శానిటైజర్ కలుకుని తాగారు..ఇద్దరు మృతి..మరొకరి పరిస్థితి విషమం

హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. మద్యం దొరక్క శానిటైజర్ కలుపుకుని తాగి ఇద్దరు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Madhya Pradesh : హోలీ పండుగ రోజు..మందు దొరక్క శానిటైజర్ కలుకుని తాగారు..ఇద్దరు మృతి..మరొకరి పరిస్థితి విషమం

Madhyapradesh

sanitizer : హోలీ పండుగ రోజు విషాదం నెలకొంది. మద్యం దొరక్క శానిటైజర్ కలుపుకుని తాగి ఇద్దరు చనిపోగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. దీంతో వారి కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.

మద్యానికి అలవాటు పడిన వారు..లిక్కర్ దొరక్కపోతే..అల్లాడుతుంటారు. ప్రత్యేకించి ఫెస్టివల్స్, ఇతరత్రా ముఖ్యమైన రోజుల్లో మద్యం షాపులను బంద్ చేస్తుంటారు. బ్లాక్ లో విక్రయిస్తున్నా..అంత డబ్బులు వెచ్చించలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటుంటారు కొందరు మద్యం బాబులు. హోలీ పండుగ రోజున మధ్యప్రదేశ్ ప్రభుత్వం మద్యం దుకాణాలను మూసివేయించింది. బింద్ జిల్లాలో జిల్లాలో లోధి అనే వ్యక్తి శానిటైజర్ బాటిళ్లను కొనుగోలు చేశాడు. తన బంధువులైన సంజు, అమిత్ వద్దకు వెళ్లి..ముగ్గురు కలిసి శానిటైజర్ లో వాటర్ కలుపుకుని తాగారు.

అదే రోజు రాత్రి లోధి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. సమీప ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మిగతా ఇద్దరికి కూడా ఆరోగ్యం బాగా లేకపోవడంతో గ్వాలియర్ లోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే..చికిత్స పొందుతూ అమిత్ మృతి చెందగా..సంజు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.