Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది. ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం, రాష్ట్రాలకు వివరించింది.

Covid-19: కోవిడ్ తీవ్రతపై కేంద్ర ఆరోగ్య శాఖ సమీక్ష.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

Covid-19: ప్రస్తుత కోవిడ్ పరిస్థితులపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం సమీక్ష నిర్వహించింది. రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్సుక్ మాండవీయ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది.

Nasal Vaccine: నేటి నుంచి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి.. అనుమతించిన కేంద్రం

ఈ సందర్భంగా కేంద్రం పలు సూచనలు చేసింది. దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ల వ్యాప్తి, దీని కట్టడికి తీసుకోవాల్సిన చర్యలు, రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరి చేయడం, నూతన సంవత్సర వేడుకలు, పండుగల సందర్భంగా ప్రజలు కోవిడ్ నియమావళి పాటించేలా చూడటం, మూడో డోస్/బూస్టర్ డోసు తీసుకునేలా చేయడం వంటివి చేయాలని రాష్ట్రాలకు సూచించింది. అలాగే కోవిడ్ పాజిటివ్ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపడంతోపాటు, ఆస్పత్రుల్లో తగిన సన్నద్ధత కలిగి ఉండాలని కూడా కేంద్రం ఆదేశించింది. అత్యవసర పరిస్థితిలో చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రులు, అధికారులకు కేంద్రం సూచించింది.

Soldiers Killed: లోయలో పడ్డ సైనిక వాహనం.. 16 మంది భారత సైనికులు మృతి

ఈ మేరకు వివిధ దేశాల్లో విస్తరిస్తున్న బిఎఫ్ 7 వేరియంట్ ప్రభావం, ఇతర దేశాల్లో పరిస్థితులు, కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్రం, రాష్ట్రాలకు వివరించింది. ఈ అంశంపై కేంద్రం రాష్ట్రాలకు మరో లేఖ కూడా రాసింది. కోవిడ్-19 విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. టెస్ట్-ట్రాక్-ట్రీట్, వ్యాక్సినేషన్, కోవిడ్ నియమావళి పాటించడంపై దృష్టి పెట్టాలని సూచించింది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ కార్యదర్శులకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.