ఆ 9నిమిషాలు ఫ్యాన్,ఏసీ,కంప్యూటర్ల స్విచ్ ఆఫ్ చేయక్కర్లేదు: కేంద్రం క్లారిటీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 11:56 AM IST
ఆ 9నిమిషాలు ఫ్యాన్,ఏసీ,కంప్యూటర్ల స్విచ్ ఆఫ్ చేయక్కర్లేదు: కేంద్రం క్లారిటీ

కరోనావైరస్ యొక్క చీకటి” తో పోరాడటానికి సంఘీభావం చూపించే విధంగా ఆదివారం(ఏప్రిల్-5,2020)రాత్రి 9గంటల సమయంలో దేశంలోని అందరూ 9నిమిషాల పాటు కరెంట్ ఆఫ్ చేసి,దీపాలను లేదా కొవ్వొత్తులను వెలిగించాలని లేదా టార్చ్ ను ఆన్ చేయాలని శుక్రవారం వీడియో మెసేజ్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే రేపు రాత్రి ప్రజలు వోల్టేజ్ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందవలసొన అవసరం లేదు.

మోడీ విజ్ణప్తి… గ్రిడ్‌లో అస్థిరతకు మరియు వోల్టేజ్‌లో హెచ్చుతగ్గులకు కారణమవుతుందని, ఇది  విద్యుత్ పరికరాలకు హాని కలిగిస్తుందని కొన్ని భయాలు వ్యక్తమవుతున్న సమయంలో కేంద్ర విద్యుత్ శాఖ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చింది. కొంతమంది నుంచి వ్యక్తమవుతున్న ఈ భయాలు తప్పుగా ఉన్నాయి అని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. భారతీయ విద్యుత్ గ్రిడ్ దృఢమైనది మరియు స్థిరమైనది మరియు డిమాండ్ లో  వైవిధ్యాన్ని నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు మరియు ప్రోటోకాల్స్ ఉన్నాయి అని తెలిపింది.

 ప్రజలు తమ ఇళ్లల్లోని లైట్లను మాత్రమే 9నిమిషాల పాటు ఆర్పాలని మోడీ విజ్ణప్తి చేశాడని,వీధి లైట్లు, తమ ఇళ్లల్లోని కంప్యూటర్లు,టీవీలు,ఫ్యాన్ లు రిఫ్రిజరేటర్లు,ఏసీలు ఆపాలని మోడీ పిలుపునివ్వలేదని  కేంద్ర విద్యుత్ శాఖ సృష్టం చేసింది. హాస్పిటల్స్ లోని లైట్లు మరియు ఇతర ఎసెన్షియల్ సర్వీసులు(పబ్లిక్ యుటిలిటీస్,మున్సిపల్ సర్వీసెస్,ఆఫీసులు,పోలీసు స్టేషన్లు,మా్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ వంటివి)లోని లైట్లు ఎప్పటిలాగానే ఆన్ లో ఉంటాయని తెలిపింది. కేవలం ఇళ్లల్లోని లైట్ ల స్విచ్ లు మాత్రమే ఆఫ్ చేయాలని మోడీ పిలుపునిచ్చారని తెలిపింది. ప్రజాభద్రత దృష్యా వీధి లైట్లు అన్నింటినీ ఆన్ లో ఉంచాలని అన్ని లోకల్ బాడీలకు సూచించడం జరిగిందని తెలిపింది.

అంతకుముందు కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లు,నర్సులుచమెడికల్ సిబ్బందికి సంఘీభావంగా జనతా కర్ఫ్యూ(మార్చి-22,2020)రోజున సాయంత్రం 5గంటల సమయంలో తమ తమ ఇళ్ల బాల్కనీలోకి లేదా గుమ్మం దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టాలని మోడీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. మోడీ పిలుపుకు విశేష స్పందన కూడా లభించింది. జనతా కర్ఫ్యూ రోజు సాయంత్రం 5గంటల సమయంలో దేశమంతా చప్పట్లతో మార్మోగిపోయింది.

Also Read | ధారవిలో వైరస్‌ విస్ఫోటం తప్పదా? మురికివాడపై కరోనాకు కన్ను కుట్టిందా?