PM Modi : దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది..యువతపై ఫోకస్ పెట్టండీ : ప్రధాని మోడీ

దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది..యువతపై ఫోకస్ పెట్టండీ అంటూ ప్రధాని మోడీ బీజేపీ నేతలకు పిలుపునిచ్చారు.

PM Modi : దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది..యువతపై ఫోకస్ పెట్టండీ : ప్రధాని మోడీ

Modi

PM Modi : 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరుగునున్నాయి. దీని కోసం బీజేపీ ఇప్పటినుంచి గెలుపు కోసం పక్కాగా వ్యూహాలు రచిస్తోంది. దీని కోసం యువత ఓట్లే టార్గెట్ చేయాలని రెండు రోజుల పాటు ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 2024లో జరుగనున్న తొమ్మిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ 18-25 యువతపై ఫోకస్ పెట్టండీ అంటూ పార్టీ శ్రేణులకు దిశా నిర్ధేశం చేశారు. దేశానికి అత్యుత్తమ కాలం రాబోతోంది దానికి యువతను లక్ష్యంగా పెట్టుకోండి అంటూ పలు కీలక సూచనలు ఇచ్చారు. వచ్చే 400 రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు.

2024 సార్వత్రిక ఎన్నికలకు మరో 400 రోజులు మాత్రమే ఉందని బీజేపీ ప్రభుత్వం వచ్చాక దేశంలో జరిగిన అభివృద్ది చేపడుతున్న సంక్షేమ పథాకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజలకు సేవ చేసేందుకు వీలైన అన్ని మార్గాలను ఉపయోగించుకోవాలని..మనం చరిత్ర సృష్టించుకోవాలి అంటూ దిశానిర్ధేశం చేశారు. దేశానికి యువతే పట్టుకొమ్మలని సూచించిన మోడీ వారినే లక్ష్యంగా చేసుకుని 18 నుంచి 25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని ప్రధాని మోడీ బీజేపీ నేతలకు సూచించారు. యువతకు ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన కల్పించి సుపరిపాలనలో భాగస్వాముల్ని చేయాలని మోడీ సూచించారు. ప్రధాని మోడీ చేసిన సూచనల్ని అమలు చేసేందుకు బీజేపీ నేతలు సిద్ధమవుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాషాయదళం యుద్ధానికి సిద్ధమంటోంది.