Droupadi Murmu: క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
బ్రిటన్లో జరగబోయే క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ అంత్యక్రియలకు బ్రిటన్ అధికారికంగా భారత్కు ఆహ్వానం పంపింది.
Droupadi Murmu: బ్రిటన్లో జరగనున్న క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరుకానున్నారు. ఈ నెల 8న మరణించిన క్వీన్ ఎలిజబెత్-2 అంత్యక్రియలు వచ్చే సోమవారం (సెప్టెంబర్ 19) జరగనున్న సంగతి తెలిసిందే.
Congress Collapses In Goa: గోవాలో కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరిన 8 మంది ఎమ్మెల్యేలు
లండన్లోని బకింగ్హామ్ ప్యాలెస్లో క్వీన్ అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు ప్రపంచ దేశాలకు బ్రిటన్ ఆహ్వానం పంపింది. మయన్మార్, రష్యా, బెలారస్ మినహా అన్ని దేశాలు అంత్యక్రియల్లో పాల్గొనబోతున్నాయి. భారత్కు కూడా అధికారికంగా ఆహ్వానం అందింది. భారత్ తరఫున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా హాజరవుతారు. ఆమె ఈ నెల 17న లండన్ బయల్దేరి వెళ్తారు. అంత్యక్రియలు పూర్తైన తర్వాత ఇండియా తిరిగొస్తారు.
J&Ks Poonch: జమ్మూలో లోయలో పడ్డ బస్సు.. 12 మంది మృతి.. 25 మందికి గాయాలు
ఇప్పటికే క్వీన్ ఎలిజబెత్ మరణంపై భారత ప్రభుత్వం, ప్రధాని మోదీ సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఆదివారం మన దేశంలో సంతాప దినంగా కూడా పాటించారు.