Goa : గిరిజనులతో ప్రియాంక గాంధీ డ్యాన్స్…వీడియో వైరల్

గిరిజనులతో కలసి ప్రియాంక గాంధీ డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గోవాలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి.

Goa : గిరిజనులతో ప్రియాంక గాంధీ డ్యాన్స్…వీడియో వైరల్

Priyanka

Priyanka Gandhi : వచ్చే సంవత్సరంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు కాంగ్రెస్ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ..ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. వారితో కలిసి భోజనం చేయడం, రోడ్లు ఊడ్వడం వంటివి చేస్తున్నారు. తాజాగా..గిరిజనులతో కలసి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. గోవాలో త్వరలో ఎన్నికలు జరుగనున్నాయి. అందులో భాగంగా ప్రియాంక గాంధీ అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. 2021, డిసెంబర్ 11వ తేదీ మొర్పిర్ల గ్రామంలో పర్యటించారు.

Read More : Corona Cases : ఏపీలో కొత్తగా 156 కరోనా కేసులు, ముగ్గురు మృతి

స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్న ఆమె…మహిళా గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. ఎర్రటి చీరను ధరించిన ఆమె..గిరిజనులతో స్టెప్పులు వేశారు. ఈ మేరకు కాంగ్రెస్ ట్వీట్ చేసింది. ఈ గ్రామంలో ఆత్మవిశ్వాసం కలిగిన గిరిజన మహిళలు ఉంటారని, వీరు పర్యావరణ పరిరక్షణ పచ్చదనాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొంది. అయితే..ప్రియాంక గాంధీ చేసిన ఈ డ్యాన్స్ పై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. తమిళనాడు రాష్ట్రంలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన…సీడీఎస్ చీఫ్ జనరల్ రావత్ శోకసంద్రంతో నివాళులర్పిస్తున్నారని, ఈ సమయంలో గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ లు చేస్తారా అంటూ….బీజేపీ ఐటీ సెల్ ఇన్ చార్జ్ అమిత్ మాల్వియా విమర్శించారు.