Bharat Jodo Yatra: నేటి నుంచి ప్రారంభంకానున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. ఈ రోజు షెడ్యూల్ ఇలా..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ అధికారికంగా యాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమవుతుంది.

Bharat Jodo Yatra: నేటి నుంచి ప్రారంభంకానున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’.. ఈ రోజు షెడ్యూల్ ఇలా..

Rahul Gandhi

Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు కన్యాకుమారి వద్ద రాహుల్ గాంధీ అధికారికంగా యాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్ర మాత్రం గురువారం నుంచి ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పాదయాత్ర చేపట్టడం ఇదే తొలిసారి. ఈ యాత్రకు ఏ ఎన్నికలతోనూ సంబంధం లేదని, కేవలం భారత్ ను ఏకం చేయడమే లక్ష్యంగా ఈ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాల్లో 3,570 కిలో మీటర్ల మేర 150 రోజులు సాగనుంది. ఈ యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ తెల్లటి దుస్తులు ధరించి పాల్గొంటారు. రాహుల్ వెంట ఆయా ప్రాంతాల్లో రెండు బ్యాచ్ లలో ప్రతిరోజూ 22 నుంచి 23 కిలో మీటర్లు పాల్గొంటారు. రాత్రి సమయంలో రాహుల్ కంటైనర్లలో బస చేస్తారు.

Rahul Gandhi: దేశాన్ని ముక్కలు చేయడమో మోదీ విధానం.. బీజేపీ, ప్రధానిపై రాహుల్ ఫైర్

తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారిలో ‘భారత్ జోడో యాత్ర’ ప్రారంభానికి ముందు రాహుల్ గాంధీ ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. మంగళవారం రాత్రే రాహుల్ తమిళనాడుకు చేరుకున్నారు. బుధవారం ఉదయం 7గంటలకు చెన్నై సమీపంలోని శ్రీ పెరంబదూర్‌లో ఉన్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ స్మారకాన్ని సందర్శిస్తారు. తండ్రికి అంజలి ఘటిస్తారు. సుమారు గంట సేపు పలు మతాల ఆచారాల ప్రకారం ప్రార్థనలు కాంగ్రెస్ నేతలు జరపనున్నారు. రాజకీయ ప్రవేశం తర్వాత రాహుల్ గాంధీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. మధ్యాహ్నం 3.05 గంటలకు తీరువల్లూర్ మెమోరియల్ ను రాహుల్ సందర్శిస్తారు. 3.25గంటలకు కామరాజ్ మెమోరియల్‌ను సందర్శించి, సాయంత్రం 4.10గంటలకు మహాత్మాగాంధీ మండపం వద్ద ప్రార్థనలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహాత్మాగాంధీ మండపంలో జాతీయ జెండా అందజేత కార్యక్రమంలో భాగంగా తమిళనాడు సీఎం ఎం.కే. స్టాలిన్ రాహుల్ కు జాతీయ జెండాను అందిస్తారు. 4.40 గంటలకు భారత్ జోడో యాత్రికులతో కలిసి మహాత్మా గాంధీ మండపం నుంచి బీచ్ రోడ్ వరకు జరిగే మార్చ్ లో రాహుల్ పాల్గొని ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు కన్యాకుమారికి చేరుకొని భారత్ జోడో యాత్రను రాహుల్ గాంధీ అధికారికంగా ప్రారంభిస్తారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ యాత్ర ప్రారంభంలో భాగంగా తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలు  పాల్గోనున్నారు. అయితే గురువారం ఉదయం 7గంటల నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రారంభం కానుంది.

Rahul Gandhi: నేటి ఈ దుర్భర పరిస్థితికి ప్రధానమంత్రి మాత్రమే బాధ్యత వహిస్తారు.. మోదీపై రాహుల్ విమర్శలు

భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో సహా ఆయన వెంట పాల్గొనే యాత్రికులు రాత్రిళ్లు కంటైనర్లలోనే బస చేస్తారు. ఇందుకోసం మొత్త 60 కంటైనర్లను ఏర్పాటు చేశారు. కొన్ని కంటైనర్లలో స్లీపింగ్ బెడ్లు, టాయిటెట్లు, ఏసీలు కూడా అమర్చారు. భద్రతా కారణాల దృష్ట్యా రాహుల్ గాంధీ ఒక కంటైనర్ లో ఉంటారు. ఇతరులు మిగిలిన కంటైనర్లలో ఉంటారు. భారత్ జోడో యాత్ర కేరళ రాష్ట్రంలో 18రోజులు, కర్ణాటకలో 21 రోజులు ఉంటుంది. పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నిక జరిగే సమయంలో యాత్ర కర్ణాటకలో సాగుతుంది.

Bharat Jodo Yatra

Bharat Jodo Yatra