Bihar: మధ్యాహ్న భోజనంలో పాము.. ఆసుపత్రిపాలైన విద్యార్థులు
ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో (ఎన్జీవో పేరును పోలీసులు వెల్లడించలేదు) తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు
Mid-Day Meal: బడి పిల్లలకు వండిన అన్నంలో పాము పడింది. ఇది తెలియక అన్నం తిన్న విద్యార్థులు.. పదుల సంఖ్యలో ఆసుపత్రి పాలయ్యారు. బీహార్ రాష్ట్రంలోని అరారియా జిల్లా ఫోర్బెస్గంజ్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది ఈ ఘటన. అస్వస్థతకు గురైన పిల్లల్ని ఫోర్బ్స్గంజ్లోని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నట్లు స్థానిక అధికారులు తెలిపారు.
Kanhaiya Kumar: బీజేపీ అబద్ధాలకు, దోపిడీకి 9 సంవత్సరాలు నిండింది.. కన్నయ్య కుమార్
అయితే ఇది పాఠశాలలో వండిన అన్నం కాదట. మధ్యాహ్న భోజనం సమయంలో ఒక ఎన్జీవో (ఎన్జీవో పేరును పోలీసులు వెల్లడించలేదు) తయారుచేసిన ‘ఖిచ్డీ’ని పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు ఒక ప్లేటులో పాము కనిపించింది. పాఠశాలలో ఈ వార్త తెలియగానే భోజన పంపిణీని నిలిపివేశారు. అయితే అప్పటికే భోజనం చేసిన విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే ఫోర్బ్స్గంజ్ ఆసుపత్రికి తరలించారు.
Dubai : ఒకరోజు షాపింగ్కి రూ.70 లక్షలు .. భర్త డబ్బు ఖర్చుచేయడం ఆమె హాబీట
ఎస్డిఎం, ఎస్డిఓ, డిఎస్పీ సహా సీనియర్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఘటనపై విచారణ జరుగుతోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.