కశ్మీర్లో సైనికుడి మిస్సింగ్.. టెర్రరిస్టుల కిడ్నాప్??

కశ్మీర్లో సైనికుడి మిస్సింగ్.. టెర్రరిస్టుల కిడ్నాప్??

కుటుంబంతో పండుగ జరుపుకోవాలని జమ్మూ కశ్మీర్ కు వెళ్లిన సైనికుడు ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండాపోయాడని ఆర్మీ చెప్తుంది. రైఫిల్ మాన్ షకీర్ మంజూర్ 162 బెటాలియన్ లో ఉంటూ సెలవుపై షోపియన్ కు వెళ్లాడు. అతను టెర్రరిస్టుల చేతిలో కిడ్నాప్ అయి ఉండొచ్చని ఆర్మీ వర్గాలు అంటున్నాయి.



#TerrorismFreeKashmir అనే హ్యాష్ ట్యాగ్ తో ‘162 బెటాలియన్‌కు చెందిన రైఫిల్ మ్యాన్ షకీర్ మంజూర్ ఆదివారం సాయంత్రం 5గంటల నుంచి కనిపించకుండాపోయాడు. అతనికి చెందిన కాలిపోయిన కారు కుల్గం దగ్గరి ప్రాంతంలో కనిపించింది. దానిని బట్టి సైనికుడ్ని టెర్రిరస్టులు కిడ్నాప్ చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సెర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది’

కుల్గం, షోపియన్, అనంత్‌నాగ్ జిల్లాల్లో సెర్చింగ్ కొనసాగతుంది. పోలీసులు డ్రోన్స్, స్నిఫ్ఫర్ డాగ్స్ వాడి వెదుకుతున్నారు. మంజూర్ కుటుంబం ఏ హాని కలగకుండా ఇంటికి వచ్చేలా చూడమని కోరుతున్నారు. సెలవుపై కశ్మీర్ వచ్చిన సైనికులను టెర్రరిస్టులు టార్గెట్ చేస్తున్నారు. దక్షిణ కశ్మీర్ లో మూడేళ్ల నుంచి టెర్రరిస్టుల దాడి ట్రెండింగ్ గా మారింది.