Tamil Nadu: తండ్రి భౌతికకాయం వద్దే యువతిని పెళ్లి చేసుకున్న కుమారుడు

తమిళనాడు రాష్ట్రం కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఆయన కుమారుడు ప్రవీణ్ వివాహం నిశ్చయమైంది. ఈనెల 27న వివాహం జరగాల్సి ఉంది. అయితే, రాజేంద్రన్‌కు కుమారుడి పెళ్లి చూడాలని చాలా కోరిక.

Tamil Nadu: తండ్రి భౌతికకాయం వద్దే యువతిని పెళ్లి చేసుకున్న కుమారుడు

Son married at Father dead body

Tamil Nadu: తమిళనాడు (Tamil Nadu) కు చెందిన ప్రవీణ్ (Praveen) అనే యువకుడికి పెళ్లి నిశ్చయమైంది. ఈనెల 27న అంగరంగ వైభవంగా పెళ్లి తంతు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. బంధువుల రాకపోకలు మొదలయ్యాయి. ఉన్నట్లుండి చెడువార్త (Bad news) ఆ కుటుంబంలో కన్నీరును మిగిల్చింది. అప్పటి వరకు ఆనందంగాఉన్న ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలోకి వెళ్లిపోయింది. ప్రవీణ్ పెళ్లికి వారంరోజులే ఉందనగా.. తన తండ్రి రాజేంద్రన్ మరణించాడు. కొడుకు పెళ్లి చూడాలని మృతుడు రాజేంద్రన్ ( Rajendran) కోరిక. ఎలాగైనా తన తండ్రి కోరిక తీర్చాలని కొడుకు భావించాడు. తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చిన యువతిని తండ్రి భౌతికకాయం ముందే పెళ్లిచేసుకొని తండ్రి కోరికను తీర్చాడు.

Tamil Nadu: చీట్ చేసిన బాయ్ ఫ్రెండ్ మీద వేడి నూనె పోసిన యువతి

తమిళనాడు రాష్ట్రం కళ్లక్కురిచ్చి సమీపంలోని పెరువంగూర్ గ్రామం ఉంది. ఆ గ్రామంలో పంచాయతీ యూనియన్ అధ్యక్షురాలు అయ్యమ్మాళ్ భర్త రాజేంద్రన్ అనారోగ్యంతో సోమవారం మరణించాడు. ఆయన కుమారుడు ప్రవీణ్ వివాహం నిశ్చయమైంది. ఈనెల 27న వివాహం జరగాల్సి ఉంది. అయితే, రాజేంద్రన్‌కు కుమారుడి పెళ్లి చూడాలని చాలా కోరిక. ఘనంగా కొడుకు పెళ్లిచేయాలని భావించాడు. కానీ, ఎవరూ ఊహించని విధంగా పెళ్లిచూడకుండానే అనారోగ్యంతో మరణించాడు. తండ్రి కోరికను ఎలాగైనా తీర్చాలని కొడుకు ప్రవీణ్ భావించాడు.

Tamil Nadu: అదంతా డ్రామా, తమిళనాడులో బిహారీలెవరూ దాడికి గురవ్వలేదు.. తేల్చి చెప్పిన నివేదిక

తండ్రి అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో అప్పటికే నిశ్చాతార్థం అయిన చెన్నైకి చెందిన యువతి స్వర్ణమాల్య, ఆమె కుటుంబ సభ్యులు రాజేంద్రన్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వచ్చారు. ప్రవీణ్ వారివద్దకు వెళ్లి తన పెళ్లి చూడాలనేది తన తండ్రి కోరిక అని, తన తండ్రి భౌతికకాయం ముందే వివాహం చేసుకోవాలని అనుకుంటున్నానని వివరించారు. దీంతో యువతి కుటుంబ సభ్యులుసైతం అందుకు అంగీకారం తెలిపారు. వధూవరులు ఇద్దరూ పెళ్లిదుస్తులో రెడీఅయ్యి రాజేంద్రన్ భౌతికకాయంకు నమస్కారాలు చేసి అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తండ్రిపై కొడుకు చూపిన ప్రేమను నెటిజన్లు అభినందిస్తున్నారు.