Covid Death : కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం

కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది.

Covid Death : కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం

Covid Death

Updated On : September 22, 2021 / 7:11 PM IST

Covid Death    కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు కేంద్రప్రభుత్వం ఇవాళ సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ(NDMA) సిఫార్సు చేసినట్లు పేర్కొంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి(SDRF​) నుంచి కోవిడ్ మృతుల కుటుంబాలకు ఈ పరిహారాన్ని అందిస్తామని సుప్రీంకోర్టుకి సమర్పించిన అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది. ఇప్పటికే మరణించిన వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా,భవిష్యత్తులో నమోదయ్యే మరణాలకు కూడా పరిహారం చెల్లించబడుతుందని కేంద్రం తెలిపింది. కోవిడ్ సహాయక చర్యల్లో పాల్లొని మరణించిన లేదా కోవిడ్ సంసిద్ధత కార్యక్రమాల్లో భాగస్వామ్యమై మరణించిన వారి కుటుంబాలకు కూడా పరిహారం అందించబడుతుందని కేంద్రం తెలిపింది. కోవిడ్ కారణంగా గతేడాది జనవరి నుంచి భారత్‌లో మొత్తం 4 లక్షలా 45 వేల మందికిపైగా చనిపోయారు.

ALSO READ LIC IPO..చైనా పెట్టుబడులను బ్లాక్ చేసేందుకు కేంద్రం ఫ్లాన్!

సంబంధిత కుబుంబాలు.. నిర్దేశించిన డాక్యుమెంట్లతో రాష్ట్ర అధికార యంత్రాంగం జారీ చేసే ఓ ఫామ్ ద్వారా తమ క్లెయిమ్స్ ని సమర్పిస్తారు. జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు క్లెయిమ్, ధృవీకరణ, మంజూరు మరియు పంపిణీ ప్రక్రియ సరళంగా మరియు ప్రజలకు అనుకూలంగా ఉండేలా చూస్తారు. అవసరమైన పత్రాలను సమర్పించిన 30 రోజుల్లోపు అన్ని క్లెయిమ్‌లు పరిష్కరించబడతాయని మరియు ఆధార్‌తో అనుసంధానించబడిన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ప్రక్రియల ద్వారా నగదు పంపిణీ చేయబడుతుందని కేంద్రం అఫిడవిట్‌లో పేర్కొంది.

ఏవైనా ఫిర్యాదులు ఉంటే.. అదనపు జిల్లా కలెక్టర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ (CMOH), అదనపు CMOH లేదా మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ మెడిసిన్ హెడ్‌(జిల్లాలో ఒకటి ఉంటే) కూడిన జిల్లా స్థాయి కమిటీలు మరియు ఒక విషయ నిపుణుడు వాటాని హ్యాండిల్ చేస్తారు. ఈ కమిటీ, వాస్తవాలను ధృవీకరించిన తర్వాత, సవరించిన అధికారిక పత్రాల జారీతో సహా అవసరమైన నివారణ చర్యలను ప్రతిపాదిస్తుంది. ఒకవేళ కమిటీ నిర్ణయం క్లెయిమ్‌కు అనుకూలంగా లేనట్లయితే, దానికి స్పష్టమైన కారణం నమోదు చేయబడుతుందని అఫిడవిట్ లో కేంద్రం పేర్కొంది.