Publish Date - 10:49 am, Tue, 29 January 19
By
veegamteamలుధియానా: భక్తుల నమ్మకం ఎంతగా ఉంటుందంటే.. నమ్మిన గురువులు చనిపోయినా.. బతికి ఉన్నారని నమ్ముతుంటారు. తమ గురువు మృతి చెందినా..ఆయన పార్థివ దేహాన్ని కొందరు భక్తులు ఐదేళ్ల నుంచి సంరక్షిస్తున్నారు. ఆ స్వామీజీనే అశుతోష్ మహారాజ్. ఆయన ధ్యానంలో ఉన్నారని భక్తులు నమ్ముతున్నారు. పంజాబ్లోని లుధియానాలో నూర్మహల్ డేరా చీఫ్, దివ్యజ్యోతి జాగృతి సంస్థాన్ స్వామీజీ అశుతోష్ మహారాజ్ దివంగతులయ్యారని ఐదేళ్ల క్రితమే వైద్యులు నిర్థారించారు.
అయినా సరే భక్తులు మాత్రం స్వామీజీ మృతదేహాన్ని మైనస్ 22 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ఫ్రీజర్లో ఉంచి సంరక్షిస్తున్నారు. 2014, జనవరి 28న అశుతోష్ మహారాజ్ అనారోగ్యంతో మృతి చెందారు. అప్పటి నుంచి గురువు పార్థివ దేహాన్ని ఫ్రిజర్లో ఉంచటమేకాకుండా 24 గంటలూ కాపలా ఉంటున్నారు. అంతేకాదు..పంజాబ్ హర్యానా హైకోర్టు ఆదేశాల మేరకు ముగ్గురు డాక్టర్స్ టీమ్ గా వచ్చి ప్రతీ ఆరు నెలలకు ఒకసారి స్వామీజీ మృతదేహాన్ని పరిశీలిస్తూ వస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గత ఐదేళ్ల నుంచి మృతదేహం పాడవ్వలేదని డాక్టర్స్ తెలిపారు.
1946లో బీహార్లోని దర్భంగా జిల్లాలోని నఖ్లోర్లో జన్మించిన అశుతోష్ మహారాజ్ పెళ్లయిన అనంతరం భార్యా, పిల్లలను విడిచిపెట్టి దీక్ష తీసుకున్నారు. ఈ క్రమంలోనే 1983లో ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకున్నారు. నిత్యం సత్సంగ కార్యక్రమాలు నిర్వహించేవారు. దేశ వ్యాప్తంగా అశుతోష్ మహారాజ్ పేరుతో 100 ఆశ్రమాలున్నాయి.
Viral House : ఈ ఇంటి ముందు డోర్ పంజాబ్లో..వెనుక డోర్ హర్యానాలో తెరుచుకుంటాయి
Dalit Lick Spit : ప్రేమించి పెళ్లి చేసుకున్న దళిత యువకుడు..నేలపై ఉమ్మి వేసి నాకించి..మూత్రం తాగించిన గ్రామ పెద్దలు
Bharat Bandh : ఈ నెల 26న భారత్ బంద్.. లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
Bihar SI Beaten By Locals : ఎస్సైను రాళ్లతో, కర్రలతో కొట్టి చంపిన స్ధానికులు
Nalanda crime : వరుడికి లవ్ ఎఫైర్..వధువు కాళ్లూ చేతులు కట్టేసి తల నరికేసిన దారుణం
CID SI death : అనుమానాస్పద స్ధితిలో మరణించిన సీఐడీ ఎస్సై