రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ అడిఆశే : ఎంపీ జేసీ  

  • Published By: veegamteam ,Published On : February 5, 2019 / 08:13 AM IST
రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ అడిఆశే : ఎంపీ జేసీ  

ఢిల్లీ : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, జగన్ పై విమర్శలు చేశారు. రాహుల్ గాంధీకి దేశాన్ని మార్చడం చేతకాదన్నారు. అలాగే రాహుల్ ని ప్రధాని చేయాలన్న చంద్రబాబు ఆశ కూడా అడిఆశగానే మిగిలిపోతుందని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాహుల్ ను ప్రధానిని చేసేందుకే సోనియాగాంధీ ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేశారని ఆరోపించారు. రైల్వే జోన్ వల్ల ఏపీకి లాభం లేదన్నారు. ఎన్నికలకు ముందే రైతులకు చెక్కులిస్తామని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం కావాలా… వారానికోసారి కోర్టుకెళ్లే జగన్ కావాలా? అని అన్నారు.