Bangalore : చికెన్‌ ఫ్రై వండలేదని భార్యను హతమార్చిన భర్త

కర్ణాటకలో దారుణం జరిగింది. చికెన్‌ కరీ వండలేదని భార్యను హత మార్చాడో ఓ భర్త. చికెన్ ఫ్రై వండలేదనే కోపంతో భార్యను చెక్కతో కొట్టగా తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందింది.

Bangalore : చికెన్‌ ఫ్రై వండలేదని భార్యను హతమార్చిన భర్త

Wife Kill

husband killed wife : కర్ణాటకలో దారుణం జరిగింది. చికెన్‌ కరీ వండలేదని భార్యను హత మార్చాడో ఓ భర్త. చికెన్ ఫ్రై వండలేదనే కోపంతో భార్యను చెక్కతో కొట్టగా తీవ్ర గాయాలపాలైన ఆమె మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. ముబారక్‌ పాషా, షిరాను బాను దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరు బెంగళూరులో నివసిస్తున్నారు.

ఆగస్టు 18న చికెన్‌ ఫ్రై వండాలని భార్యకు చెప్పి భర్త బయటకు వెళ్లాడు. పాషా ఇంటికి తిరిగి వచ్చి ఎంతో ఆశగా చూడగా చికెన్‌ ఫ్రై వండలేదు. దీంతో అతడు నిరాశకు గురయ్యాడు. దీంతో భార్యతో గొడవకు దిగాడు. చెకెన్ ఫ్రై ఎందుకు చేయలేదని ప్రశ్నించాడు. ఆగ్రహానికి గురైన పాషా.. భార్య తలపై చెక్కతో గట్టిగా కొట్టాడు. ఆ తర్వాత పాషా ఏమీ తెలియనట్లు ఉన్నాడు.

అయితే కొన్ని గంటలుగా ఆమె కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భర్త కదలికలపై నిఘా పెట్టారు. అతను పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.

సోమవారం (ఆగస్టు 23, 2021) పాషా నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. తర్వాత జరిగిన సంఘటనను పూసగుచ్చినట్టు చెప్పాడు. కొట్టిన దెబ్బతో తీవ్రగా గాయపడిన భార్య ఇంట్లోనే మృతి చెందింది. రాత్రి పిల్లలు నిద్రిస్తుండగా భార్య మృతదేహాన్ని ఓ సంచిలో వేసుకుని బైక్ పై బయటకు తీసుకెళ్లాడు.

బైక్‌పై చిక్కబనవర సరస్సుకు చేరుకుని మృతదేహాన్ని నీటిలో పడేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. సరస్సులో పడేసిన మృతదేహాన్ని బయటికి తీసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.