ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు బాలికలు

  • Published By: venkaiahnaidu ,Published On : September 29, 2020 / 02:55 PM IST
ప్రేమ వివాహం చేసుకున్న ఇద్దరు బాలికలు

ఉత్తర్​ప్రదేశ్​ లోని కాన్పుర్ ​లో ఇద్దరు బాలికలు ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇరు కుటుంబాలు వీరికి పెళ్ళిచేసేందుకు నిరాకరించగా…వారు పరారై, పెళ్లి చేసుకున్నారు.

కాన్పుర్ కి చెందిన రతి తివారీ, నందిని గౌతమ్​ అనే ఇద్దరు బాలికలకు ఏడాది క్రితం పరిచయం అయింది. ఇద్దరికీ పురుషులంటే ద్వేషం కాబట్టి.. రెండు మనసులూ ఏకమయ్యాయి. ఏడాది కాలంగా ఇద్దరు బాలికలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పురుష జీవితంతో సంబంధం లేకుండా వారిద్దరే కలిసుండాలని నిర్ణయించుకున్నారు.


అయితే,..వారి సంబంధంపై ఇరువురి కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఇద్దరు బాలికలు పారిపోయి.. కాన్పుర్​లోని బర్రా ప్రాంతంలో వివాహం చేసుకున్నారు.



కాగా, తన కుమార్తెను రతి, ఆమె సోదరుడు కిడ్నాప్​ చేశారని ఆరోపిస్తూ నందిని తల్లి గుడియా దేవి పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. అయితే.. ఈ ఘటనపై కూతురు నందిని స్పందించింది. రతిని తాను ఇష్టపూర్వకంగానే వివాహమాడానని.. తన తల్లి తప్పుడు ఆరోపణలు చేస్తోందని తెలిపింది.