మొదటి పెళ్లిని కప్పిపుచ్చటానికి ఆరేళ్ళ కూతుర్ని చంపిన కసాయి తల్లి

  • Published By: murthy ,Published On : September 8, 2020 / 03:09 PM IST
మొదటి పెళ్లిని కప్పిపుచ్చటానికి ఆరేళ్ళ కూతుర్ని చంపిన కసాయి తల్లి

మొదటి భర్తతో మనస్పర్ధలు రావటంతో విడాకులు తీసుకున్న మహిళ రెండో పెళ్లి చేసుకోవాలనుకుంది. రెండో పెళ్లి కోసం వచ్చిన సంబంధం వరుడికి తనకిది మొదటి పెళ్లని అబధ్ధం చెప్పింది. మొదటి భర్త ద్వారా పుట్టిన కుమార్తెను తల్లివద్ద దాచి రెండో భర్తతో కాపురం చేస్తోంది. ఒకరోజు ఈనిజం రెండో భర్తకు తెలిసింది. దాంతో వారు ముగ్గురు కల్సి ఆరేళ్ల బాలికను హత్యేచేశారు. కర్ణాటకలోని నంజనగూడ లో ఈదారుణం జరిగింది.

కర్ణాటకలోని సింజారిపుర నంజన్ గూడకు చెందిన పవిత్ర (23) అనే మహిళ తన మొదటి భర్త మాండేయ సిధ్ధేశ్ (35)తో మనస్పర్ధలు రావటంతో అతని నుంచి విడాకులు తీసుకుంది. పవిత్రకు సిధ్దేశ్ ద్వారా కుమార్తె(6) కలిగింది. రెండో పెళ్లి చేసుకునే క్రమంలో పవిత్ర ఏడాదిన్నర క్రితం ఎస్.ఆర్.సూర్యను సంప్రదించింది.



అతడికి తన మొదటి వివాహం గురించి చెప్పకుండా గోప్యంగా ఉంచింది. సూర్య పవిత్రను ఇష్టపడటంతో అతడ్ని ఏడాదిన్నర క్రితం పెళ్ళి చేసుకుంది. తన ఆరేళ్ళ కూతురుని షాదయన్ హళ్లిలో నివసిస్తున్న తల్లి గౌరమ్మ (55) వద్ద దించి అప్పుడుప్పుడు వచ్చి చూసి వెళుతూ ఉండేది. ఈ క్రమంలో ఒకరోజు ఆమె కూతురు పవిత్ర ఇంటికి వచ్చింది. ఆ సమయంలో సూర్య పక్క ఇంట్లో ఉన్నాడు. తర్వాత సూర్యకిఈ విషయం తెలిసింది. పవిత్ర తన మొదటి వివాహాం గురించిన సమాచారం చెప్పకుండా…..దాచిపెట్టి మోసం చేసిందని ఆమెను కొట్టటం ప్రారంభించాడు.
https://10tv.in/hyderabad-cops-arrest-19-years-young-man-against-premarital-affair-with-32-year-old-woman/
ఈ బాధ భరించలేని పవిత్ర తన కూతురును చంపాలనినిర్ణయించుకుంది. భర్తకు, తల్లికి ఆవిషయం చెప్పింది. ఇద్దరూ ఓకే అన్నారు. ఆగస్ట్ 25 తెల్లవారు ఝూమున అమ్ముమ్మఇంట్లో నిద్రిస్తున్న జయలక్ష్మిని హత్యే చేశారు.గౌరమ్మ కాళ్లు పట్టుకోగా, పవిత్ర కదలకుండా చేతులు పట్టుకుంది. సవతి తండ్రి సూర్య బాలిక ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు.



కొద్ది రోజులకు ఈవిషయం పవిత్ర మొదటి భర్త సిధ్దేశ్ కు తెలిసింది. కుమార్తె మృతిపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరిపారు. దర్యాప్తులోభాగంగా నిజాలు తేలటంతో ముగ్గురునిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు.