మధ్యప్రదేశ్‌లో దారుణం : యువతికి మద్యం తాగించి రెండు రోజులు గ్యాంగ్ రేప్..నిందితుల్లో ఒకరు బీజేపీ నేత

మధ్యప్రదేశ్‌లో దారుణం : యువతికి మద్యం తాగించి రెండు రోజులు గ్యాంగ్ రేప్..నిందితుల్లో ఒకరు బీజేపీ నేత

Young woman gang-raped : మధ్యప్రదేశ్‌లోని దారుణం జరిగింది. యువతికి మద్యం తాగించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శందోల్‌ జిల్లాలో నలుగురు వ్యక్తులు 20 ఏళ్ల యువతికి మద్యం తాగించి, రెండు రోజులపాటు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

యువతిని నలుగురు యువకులు కారులో కిడ్నాప్ చేశారు. జైత్‌పూర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని గడాఘాట్‌ ప్రాంతంలోని ఓ ఫామ్‌హౌస్‌ కు తీసుకెళ్లి ఆమెకు బలవంతంగా మద్యం తాగించారు. ఈ నెల 18, 19 తేదీల్లో యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. ఈ నెల 20న ఆమె ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారు.

బాధితురాలు ఆదివారం నలుగురు కామాంధులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. నలుగురు నిందితుల్లో ఒకడు స్థానిక బీజేపీ నాయకుడు విజయ్‌ త్రిపాఠీ అని తెలిసింది. అతన్ని పార్టీ నుంచి బహిష్కరించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.