టెస్టు మనదే: కోహ్లీసేన ఏకఛత్రాధిపత్యం, పేసర్లు భళా
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులోనూ విజయం సాధించింది భారత్. మూడు టీ20లు, రెండు టెస్టుల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చిన బంగ్లాను బోల్తా కొట్టించింది. కనీస పోరాటం చూపించలేకపోయిన బంగ్లాదేశ్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. తొలి ఇన్నింగ్స్లో 106పరుగులకు ఆల్ అవుట్ అయిన బంగ్లా, రెండో ఇన్నింగ్స్లో 195పరుగుల స్కోరు మాత్రమే చేసింది. 347పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ ప్రకటించిన టీమిండియాకు 46పరుగుల ముందే చేతులెత్తేయడంతో చారిత్రక టెస్టులో భారత్ విజయాన్ని నమోదుచేసుకుంది.
శుక్రవారం మొదలైన డే అండ్ నైట్ టెస్టులో పేసర్ల ధాటికి నిలువలేకపోయిన బంగ్లా బ్యాట్స్మెన్ ముగ్గురు మినహాయించి సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత పేసర్లు ఇషాంత్ శర్మ 9వికెట్లు దక్కించుకోగా, ఉమేశ్ యాదవ్ 8వికెట్లతో మట్టికరిపించాడు. తొలి ఇన్నింగ్స్లోనే టీమిండియా చేసిన స్కోరును చేరుకోలేకపోయింది బంగ్లాదేశ్. కెప్టెన్ విరాట్ కోహ్లీ వీరోచిత ప్రదర్శన చేసి 136పరుగులు పూర్తి చేశాడు.
That’s that from Day 2 as #TeamIndia are now 4 wickets away from victory in the #PinkBallTest
A 4-wkt haul for @ImIshant in the 2nd innings.
Updates – https://t.co/kcGiVn0lZi@Paytm | #INDvBAN pic.twitter.com/kj7azmZYg0
— BCCI (@BCCI) November 23, 2019
రెండో రోజు ఆటలో ఓవర్ నైట్ స్కోరు 174/3తో బరిలోకి దిగిన టీమిండియా.. 347/9పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ ఇచ్చింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన బంగ్లాదేశ్ ఆరంభంలోనే 4వికెట్లు పోగొట్టుకుంది. వికెట్లు పడుతుంటే ముష్ఫికర్ రహీమ్(59 నాటౌట్; 70 బంతుల్లో 10ఫోర్లు)తో క్రీజులో నిలిచి వికెట్లు పతనాన్ని అడ్డుకున్నాడు. మెహిదీ హసన్(15), తైజుల్ ఇస్లామ్(11)తో కలిసి జట్టును ముందుకు నడిపాడు.
India win by an innings and 46 runs in the #PinkBallTest
India become the first team to win four Tests in a row by an innings margin ??@Paytm #INDvBAN pic.twitter.com/fY50Jh0XsP
— BCCI (@BCCI) November 24, 2019
అంతకంటే ముందు దిగిన బ్యాట్స్ మెన్ అంతా సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమైయ్యారు. వారిలో షాద్మాన్ ఇస్లామ్(0), మోమినుల్ హక్(0) డకౌట్లుగా వెనుదిరగ్గా ఇమ్రుల్ కయీస్(5), మొహమ్మద్ మిథున్(6)పరుగులతో సరిపెట్టుకున్నారు.
This is #TeamIndia‘s 7 straight Test win in a row, which is our longest streak ???#PinkBallTest @Paytm pic.twitter.com/Lt2168Qidn
— BCCI (@BCCI) November 24, 2019
తొలి ఇన్నింగ్స్ని కొనసాగించిన భారత జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి (136: 194 బంతుల్లో 18ఫోర్లు) సెంచరీకి తోడు వైస్ కెప్టెన్ అజింక్య రహానె (51: 69 బంతుల్లో 7ఫోర్లు) పర్వాలేదనిపించాడు. తొలి ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 106 పరుగులకే ఆలౌట్ అవడంతో టీమిండియాకి 241 పరుగుల భారీ ఆధిక్యం దక్కింది.
Her Excellency Sheikh Hasina, Prime Minister of Bangladesh, @MamataOfficial, Honourable Chief Minister, West Bengal and #TeamIndia great @sachin_rt greet #TeamIndia ahead of the #PinkballTest pic.twitter.com/ldyrKjbxrE
— BCCI (@BCCI) November 22, 2019
రహానెతో కలిసి 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్.. ఆ తర్వాత జడేజా (12), సాహా (17 నాటౌట్)లతో పట్టుదలతో బ్యాటింగ్ కొనసాగించాడు. కోహ్లీ ఔట్ తర్వాత వచ్చిన అశ్విన్ (9), ఉమేశ్ యాదవ్ (0), ఇషాంత్ శర్మ (0) తేలిపోతుండటంతో సాహాతో కలిసి షమీ (10 నాటౌట్) క్రీజులో ఉండగా కోహ్లీ ఇన్నింగ్స్ని డిక్లేర్ ప్రకటించాడు.