IPL 2022: ధోనీతో పోటీ పడాలనుకుంటున్నా – హార్దిక్ పాండ్యా

ముంబై ఇండియన్స్ నుంచి బయటికొచ్చేసి గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సోమవారం ఆడనున్న తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది గుజరాత్..

IPL 2022: ధోనీతో పోటీ పడాలనుకుంటున్నా – హార్దిక్ పాండ్యా

Hardik Pandya

IPL 2022: ముంబై ఇండియన్స్ నుంచి బయటికొచ్చేసి గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్ అయిపోయాడు హార్దిక్ పాండ్యా. సోమవారం ఆడనున్న తొలి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుతో ఆడేందుకు సిద్ధమైంది గుజరాత్ టైటాన్స్. ఈ సందర్భంగా మ్యాచ్ కు ముందు మాట్లాడిన హార్దిక్ పాండ్యా.. తన మనస్సులోని భావాలను ఇలా చెప్పాడు.

‘లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీ కెప్టెన్‌ను మాట్లాడుతున్నా.. నేనెక్కడి నుంచి మీకు చెప్పనవసరం లేదనుకుంటా. మీ అందరికీ తెలిసిందే. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళతానో నేను చెప్తా. క్రీడా సక్సెస్ ల శిఖరానికి చేరుస్తా. కష్టంతో కూడిన శ్రమ అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. నా సోదరుడు ఎంఎస్ ధోనీని చేరుకోవాలి. తనతో పోటీ పడాలి అనుకుంటున్నా’ అని వీడియోలో వివరించాడు పాండ్యా.

‘నా హీరో సచిన్ టెండూల్కర్ చెప్తుంటే విన్నా. ఆ స్థాయికి అతను చేరుకోవడం గురించి.. ఒక్కోసారి నా అన్నతో పోటీపడి ఆడే ప్రయాణం గురించి, నా క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నా. ప్రతి ఫైట్, నాకొక అద్భుతమైన అనుభవాన్ని ఇస్తుందని ఆశిస్తున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.

Read Also: గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్‌గా రషీద్ ఖాన్

ఐపీఎల్ వేలం కంటే ముందే గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను, రషీద్ ఖాన్, శుభ్ మన్ గిల్‌లను జట్టులోకి తీసుకుంది. హార్దిక్ ను కెప్టెన్ గా నియమించింది.