Virat Kohli: కోహ్లీ కళ్లల్లో నీళ్లు.. పాక్‌పై గెలుపు తర్వాత విరాట్ భావోద్వేగం

పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు విరాట్ కోహ్లీ. మ్యాచులో గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

Virat Kohli: కోహ్లీ కళ్లల్లో నీళ్లు.. పాక్‌పై గెలుపు తర్వాత విరాట్ భావోద్వేగం

Virat Kohli: పాకిస్తాన్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌ కారణంగా భారత్ ఈ విజయం దక్కించుకుంది. దీంతో భారత క్రీడాభిమానులంతా విరాట్‌ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

Rohit Sharma: జాతీయ గీతం సందర్భంగా భావోద్వేగానికి గురైన రోహిత్ శర్మ.. నెటిజన్ల ప్రశంసలు

మ్యాచ్ చివరి వరకు క్రీజులో ఉన్న విరాట్ కోహ్లీ.. గెలుపు అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. భారత్ మ్యాచ్ గెలవగానే, కోహ్లీ ఆనందంతో పిచ్ చుట్టూ పరుగెత్తుకుంటూ వచ్చాడు. అనంతరం మోకాళ్లపై కూర్చుని తన ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన టీమ్‌మేట్స్ వచ్చినప్పుడు మరింత భావోద్వేగానికి గురయ్యాడు. తనను అందరూ అభినందిస్తున్నప్పుడు అతడి కళ్లు చెమర్చాయి. ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ 53 బంతులతో 82 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.

Karnataka: పేరెంట్స్ నుంచి రూ.100 వసూలు నిర్ణయంపై వెనక్కి తగ్గిన సర్కారు.. ఆదేశాలు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

ఒక వైపు వికెట్లు పడిపోతుంటే తను ధాటిగా ఆడుతూ ఇండియాను విజయంవైపు చేర్చాడు. మరోవైపు కోహ్లీకి హార్ధిక్ పాండ్యా తోడయ్యాడు. ఇద్దరూ కలిసి భారత్‌కు మర్చిపోలేని విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ క్రీడాభిమానులకు అసలైన క్రికెట్ మజాను అందించింది.