కిడ్నాప్ ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ?

కిడ్నాప్ ఎవరు చేశారు ? ఎందుకు చేశారు ?

Bowenpally Kidnap  : జాతీయ హాకీ మాజీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు, అతని ఇద్దరి సోదరుల కిడ్నాప్ కథ సుఖాంతం అయ్యింది. ప్రవీణ్‌రావుతో పాటు ఆయన సోదరులు నవీన్‌రావు, సునీల్‌ రావును గుర్తు తెలియని దుండగులు రాత్రి కిడ్నాప్‌ చేశారు. మూడు వాహనాల్లో వచ్చిన దుండగులు… ముగ్గురిని ఆ వాహనాల్లోనే కిడ్నాప్‌ చేశారు. కిడ్నాప్‌నకు గురైన ముగ్గురిని పోలీసులు రక్షించారు. సేఫ్‌గా ఇంటికి తీసుకొచ్చారు. అయితే ముగ్గురిని ఎవరు కిడ్నాప్‌ చేశారు, ఎందుకు కిడ్నాప్‌ చేశారన్న దానిపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది.

కిడ్నాప్‌ వెనుక దాగున్న అసలు కథ ఏంటన్నది మాత్రం తెలియడం లేదు. పోలీసులుగానీ… అటు కుటుంబ సభ్యులుగానీ…. కిడ్నాప్‌ వెనుక దాగున్న గుట్టు ఏంటో చెప్పడం లేదు. దీంతో కిడ్నాప్‌పై నెలకొన్న సందేహాలు అలాగే ఉండిపోయాయి. గంటల వ్యవధిలోనే కిడ్నాప్‌ను ఛేదించిన పోలీసులు…. కిడ్నాప్‌ గుట్టు మాత్రం చెప్పడం లేదు. చిన్న కిడ్నాప్‌ ఛేదిస్తేనే ప్రెస్‌మీట్‌లు పెట్టిమరీ వివరించే పోలీసులు…ఈ కిడ్నాప్‌ విషయంలో మౌనమే వారి సమాధానమైంది. స్వయంగా హైదరాబాద్‌ సీపీ పర్యవేక్షణలో కిడ్నాప్‌ ఛేదించినా పోలీసులు.. ఎలాంటి వివరాలు చెప్పలేదు. మీడియాతో మాట్లాడటానికే పోలీసు అధికారులు ఇంట్రెస్ట్‌ చూపించలేదు.

మరోవైపు ప్రవీణ్‌రావు కుటుంబ సభ్యులు కూడా సైలెంట్‌ అయిపోయారు. కిడ్నాప్‌నకు గురికాగానే.. తమ వారిని సేఫ్‌గా వదిలిపెట్టాలని మీడియా ద్వారా వేడుకున్న ఫ్యామిలీ మెంబర్స్‌ … వారు సేఫ్‌గా ఇంటికి వచ్చిన తర్వాత సైలెంట్‌ అయ్యారు. ఏం జరిగిందో చెప్పడానికి ఆసక్తి చూపలేదు. అయితే ఈ ముగ్గురిని కిడ్నాప్‌ ఎవరు చేశారు, ఎందుకు చేశారన్న దానిపై కొంత ప్రచారం నడుస్తోంది. ముగ్గురి కిడ్నాప్‌నకు ల్యాండ్‌ వివాదాలే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హఫీజ్‌పేటలోని కోట్ల విలువచేసే ల్యాండ్‌ కోసం కిడ్నాపైన ముగ్గురికి, మరికొంత మందికి మధ్య కొన్నాళ్లుగా వివాదం నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యర్థులు కిడ్నాప్‌ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది.