CM KCR National Party: నేడే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. హాజరుకానున్న 283 మంది ప్రజాప్రతినిధులు

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చరిత్ర కొత్త మలుపు తిరగబోతోంది. పార్టీ ఆవిర్భవించిన 21 సంవత్సరాల తరువాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ స్థానంలో నూతనంగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా నేడు ప్రకటించనున్నారు.

CM KCR National Party: నేడే సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన.. హాజరుకానున్న 283 మంది ప్రజాప్రతినిధులు

CM KCR

CM KCR National Party: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) చరిత్ర కొత్త మలుపు తిరగబోతోంది. పార్టీ ఆవిర్భవించిన 21 సంవత్సరాల తరువాత జాతీయ పార్టీగా రూపాంతరం చెందనుంది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ స్థానంలో నూతనంగా ఏర్పాటయ్యే జాతీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా ప్రకటించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ముహూర్తాన్ని ఖరారు చేశారు. బుధవారం తెలంగాణ భవన్ లో జరిగే సర్వసభ్య సమావేశంలో పేరుమార్పుపై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. 283 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతారు. మధ్యాహ్నం 1.19 గంటలకు తీర్మానంపై కేసీఆర్ సంతకం చేస్తారు. సభ్యులు ఆమోదించిన తీర్మానంపై కేసీఆర్ ప్రకటన చేస్తారు.

CM KCR New Party: దసరా రోజు మరోసారి పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ.. ఆ రోజే కొత్త పార్టీపై ప్రకటన?

టీఆర్ఎస్ స్థానంలో ఏర్పాటయ్యే పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)గా కేసీఆర్ ఖరారు చేశారు. దాదాపుగా వందకుపైగా పేర్లను పరిశీలించిన అనంతరం కేసీఆర్ బీఆర్ఎస్ పేరును ఎంపిక చేశారు. భారత్ రాష్ట్ర సమితి అంటే హిందీలోనూ అందరికీ అర్థమవుతుందని, హిందీలో భారత దేశ సమితి అనే అర్థం వస్తుందనే ఉద్దేశంతో ఈ పేరును ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంన్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకోనున్నారు. సీఎం కేసీఆర్ పార్టీ ప్రకటన అనంతరం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు జరిపేలా టీఆర్ఎస్ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే సర్వసభ్య సమావేశంకు 283 మంది సభ్యులు పాల్గోనున్నారు. అంతేకాక సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి, తమిళనాడుకు చెందిన వీసీకే పార్టీ అధ్యక్షుడు, ఎంపీ తిరుమవలవన్ తదితరులు హాజరు కానున్నారు. మంగళవారం సాయంత్రమే వీరు హైదరాబాద్ కు చేరుకున్నారు. వారికి బేగంపేట విమానాశ్రయంలో మంత్రి కేటీఆర్, శాసనసభ విప్ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తదితరులు స్వాగతం పలికారు. కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న నేపథ్యంలో తెలంగాణ భవన్ ను భారీగా అలంకరించారు. భవన్ చుట్టుపక్కలా, హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో జాతీయ పార్టీని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ప్లెక్సీలు, కటౌట్లను ఏర్పాటు చేశారు.