Covid-19 : వ్యాక్సిన్ రెండుసార్లు తీసుకున్నా వదలని కరోనా..
వ్యాక్సిన్ రెండు డోసులు తీసేసుకున్నాం.. ఇంకా కరోనా దరిచేరదులే అనుకుంటే పొరపాటే.. వదల బొమ్మాలి.. వదలా? అన్నట్టుగా కరోనా వెంటాడుతూనే ఉంటుంది.
Two doses of Vaccination : వ్యాక్సిన్ రెండు డోసులు తీసేసుకున్నాం.. ఇంకా కరోనా దరిచేరదులే అనుకుంటే పొరపాటే.. వదల బొమ్మాలి.. వదలా? అన్నట్టుగా కరోనా వెంటాడుతూనే ఉంటుంది. వ్యాక్సిన్ రెండుసార్లు తీసుకున్న వారికి కూడా మళ్లీ కరోనా సోకుతున్న కేసులు నమోదవుతున్నాయి. వరంగల్లో ఈ కేసులు పెరుగుతున్నాయి. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో పనిచేస్తున్న ఫార్మసిస్టు రెండు డోసుల టీకా తీసుకున్నా మళ్లీ కరోనా బారిన పడ్డారు.
కీర్తినగర్ యూపీహెచ్సీల్లో నాలుగు రోజుల కిందట 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు కరోనా టెస్టులు చేయించుకున్నారు. అందులో రెండోవిడత టీకా తీసుకున్న ఏడుగురికి కొవిడ్ నిర్ధారణ అయినట్లు తేలింది. టీకా తీసుకున్నవారికి కొవిడ్ పాజిటివ్ వస్తే అధికారులు పాజిటివ్ రిపోర్టు చేతికి ఇవ్వడం లేదు. మొబైల్ ఫోన్ కు మెసేజ్ పంపడం లేదు. వ్యాక్సిన్ తీసుకున్నవారికి పాజిటివ్ వస్తే పోర్టల్లో తీసుకోవడం లేదని సిబ్బంది చెబుతున్నారని బాధితులు తెలిపారు.
పాజిటివ్ రిపోర్టు ఇస్తేనే అధికారులు సెలవు మంజూరు చేస్తామంటున్నారని ఆందోళన చెందుతున్నారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నా జాగ్రత్తలు పాటించాల్సిందేనని అంటున్నారు. టీకా వేయించుకుంటే వంద శాతం వైరస్ సోకదని చెప్పలేమంటున్నారు.