ED Raids : ఎంపీ నామా ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు నివాసంలో ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఆయనకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలు సహా ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులకు ఒక వెయ్యి 64 కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ED Raids : ఎంపీ నామా ఇంట్లో కొనసాగుతున్న సోదాలు

Trs Mp Nama

TRS MP Nama Nageswara Rao : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు నివాసంలో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. 2021, జూన్ 11వ తేదీ శుక్రవారం ఉదయం నుంచి ఆయనకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థలు సహా ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులకు ఒక వెయ్యి 64 కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. నామాతో పాటు మధుకాన్‌ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఆయా సంస్థల అకౌంట్లు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన కీలక సమాచారాన్ని సేకరిస్తున్నారు. కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

– ఖమ్మం, హైదరాబాద్ తో పాటూ ఆరు చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ.

– మదుకాన్ కంపెనీలో పలు రాంచీ ప్రాజెక్టు సంబంధించిన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఈడీ.

– జూబ్లీహిల్స్ నామా నాగేశ్వరరావు సమక్షంలో కొనసాగుతున్న ఈడీ సోదాలు.

– అక్రమంగా నిధులు మళ్లించారని మనీ ల్యాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసిన ఈడీ.

– ఈ రోజు సాయంత్రం వరకు కొనసాగనున్న ఈడీ సోదాలు.

2011లో రాంచీ-జంషెడ్‌పూర్ హైవే కాంట్రాక్ట్‌ను మధుకాన్ సంస్థ దక్కించుకుంది. ఆ ప్రాజెక్ట్ కోసం 1064 కోట్లు లోన్ తీసుకుంది. అయితే.. అందులోనుంచి కోట్ల రూపాయలు పక్కదారి పట్టించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఏళ్లు గడిచినా పనుల్లో పురోగతి లేదంటూ రాంచీ హైకోర్టులు పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. దీంతో… సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్‌కు హైకోర్ట్ ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ జరిపింది.

నిధుల మళ్లింపుపై కూపీ లాగిన సీబీఐ 2019లో కేసు నమోదు చేసింది. 2020లో సీబీఐ చార్జీ షీట్ ఫైల్ చేసింది. ఎఫ్ఐఆర్లో మధుకాన్ డైరెక్టర్లు శ్రీనివాస్‌రావు, సీతయ్య, పృథ్వీ తేజ్‌ల పేర్లను చేర్చింది. మరోవైపు.. గత ఏడాది రాంచీ – జంషెడ్ పూర్ పనుల నుంచి కూడా మధుకాన్ కంపెనీని తొలగించారు. కంపెనీ డైరెక్టర్లపై కూడా సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. మధుకాన్ ఆడిటర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. మధుకాన్ పై 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సీబీఐ ఛార్జ్ షీటు ఆధారంగా ఈడీ విచారణ ప్రారంభించింది.

విచారణలో భాగంగా.. నామాతో పాటుగా కంపెనీ డైరెక్టర్ల నివాసాల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి. విదేశీ కంపెనీలకు నిధులు మళ్లించటంతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మధుకాన్ కోసం పలు బ్యాంకుల కన్సార్షియంతో నిధులు తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

Read More : Sharmila : రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు..కనీసం వడ్డీ కూడా మాఫీ చేయలేదు..