Bandi Sanjay: బీజేపీని ఆదరించడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు: బండి సంజయ్
తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పోలీసులు లేకుండా కేసీఆర్ పాదయాత్ర చేయాలని సూచించారు. అలా చేస్తే తాను పాదయాత్ర మానేస్తానని అన్నారు.
Bandi Sanjay: తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిపోతుండటాన్ని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. పెద్దపల్లి సభలో బీజేపీపై కేసీఆర్ చేసిన విమర్శలకు జవాబిచ్చారు బండి సంజయ్. సోమవారం సాయంత్రం ఆయన పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.
Viral video: పెరట్లో మంచంపై పడుకున్న మహిళ.. ఆమె మీదికెక్కిన నాగుపాము.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో
ఈ సందర్భంగా టీఆర్ఎస్, కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. ‘‘మోదీని, కేంద్రాన్ని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరిగిపోతుండటాన్ని సీఎం కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు కేసీఆర్కు కనిపించడం లేదా? తెలంగాణ రైతులను పట్టించుకోరు. పంజాబ్ రైతులకు డబ్బులిస్తారు. రుణ మాఫీ ఎందుకు చేయడం లేదో కేసీఆర్ చెప్పాలి. రైతులతో రాజకీయం చేయడం తగదు. ఉచితంగా ఎరువులు ఇస్తానని చెప్పి మాట తప్పారు. సన్నవడ్లు వేసి నష్టపోయిన రైతులను ఆదుకోలేదు. క్రైమ్ రేటులో దేశంలోనే తెలంగాణ ముందుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంపై కేసీఆర్ కుటుంబం సమాధానం చెప్పాలి.
CM KCR: ఎల్లుండి బిహార్కు సీఎం కేసీఆర్.. నితీష్ కుమార్తో జాతీయ రాజకీయాలపై చర్చ
డ్రగ్స్, మైన్స్, మానవ అక్రమ రవాణా దందాలతో సంబంధాలను తేల్చాలి. ప్రధాని మోదీకి కేసీఆర్ వంగివంగి దండాలు పెట్టింది నిజం కాదా? ఇతర పార్టీల నేతలను తిరగనీయొద్దని చెప్తారా? పోలీసులు లేకుండా సీఎం కేసీఆర్ పాదయాత్రా చేస్తారా? కేసీఆర్ పాదయాత్ర చేస్తానంటే నేను పాదయాత్ర మానేస్తా’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.