Etala Rajender : సంఘాలను బ్యాన్ చేస్తానంటే.. నిన్నే బ్యాన్ చేస్తారు : సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు.

Etala Rajender : సంఘాలను బ్యాన్ చేస్తానంటే.. నిన్నే బ్యాన్ చేస్తారు : సీఎం కేసీఆర్ పై ఈటల ఫైర్

Etala Rajender (3)

Etala Rajender : ముఖ్యమంత్రి కేసీఆర్ పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. ఏ ఉద్యమం ద్వారా అయితే తెలంగాణ ఏర్పడిందో దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. ఏ సంఘాల చైతన్యంతో అయితే ఉద్యమం నడిపామో రాష్ట్రంలో ఆ సంఘాలకే చోటు లేదు అన్నాడు అని వెల్లడించారు.

సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పాలరం గ్రామంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దొంతగాని వీరబాబు కుటుంబ సభ్యులను బుధవారం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఇచ్చేవాన్ని మీరు పుచ్చుకునేవారు’ అని రాచరికపు పాలన నడుస్తుందని విమర్శించారు.  పంచాయతీ కార్యదర్శులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.

Etala Rajender : సీఎం కేసీఆర్ పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే ఉక్కు పాదం మోపి చిన్న చిన్న ఉద్యోగులపై కక్ష సాధింపుతో వ్యవహరించారని మండిపడ్డారు. ఆశ వర్కర్లకు, వివోఏ లకు కనీస వేతనం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శులను 2019లో రిక్రూట్ మెంట్ చేయగా ఏప్రిల్ 11 నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తైనా నేటి వరకు రెగ్యులర్ చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 9300 మంది గ్రామ పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తుంటే కనీసం ఉద్యోగ భద్రత ఇవ్వకపోగా పంచాయతీ కార్యదర్శులపై ఉక్కు పాదం మోపుతున్నారని విమర్శించారు. ‘రాష్ట్రంలో సంఘాలను బ్యాన్ చేస్తాను అంటే.. రాష్ట్రంలో నిన్నే బ్యాన్ చేసే రోజు వస్తుంది’ అని పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శులకు అండగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు.