Sharmila : 24న మంచిర్యాలలో షర్మిల దీక్ష
వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మంగళవారం (24న) మంచిర్యాల జిల్లాలో దీక్ష చేయనున్నారు.
Sharmila : వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మంగళవారం (24న) మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం, లింగాపూర్ లో నిరుద్యోగ నిరాహార దీక్షను చేపట్టనున్నారు. ఆ గ్రామానికి చెందిన నిరుద్యోగి భూక్యా నరేష్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్నారు. అతడి ఇంటివద్దే ఆమె దీక్ష చేయనున్నారు. పార్టీ అధికార ప్రతినిధి టీ దేవేందర్ శనివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో వంద నుంచి 200 మంది నిరుద్యోగులతో నామినేషన్ వేయించనున్నట్లు తెలిపారు.