CM KCR : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం

మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. CM KCR

CM KCR : టార్గెట్ కాంగ్రెస్.. హస్తం పార్టీని కట్టడి చేసేలా కేసీఆర్ వ్యూహం

CM KCR Target Congress

CM KCR Target Congress : అసెంబ్లీ ఎన్నికల్లో తన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసేనని భావిస్తోంది అధికార బీఆర్ఎస్. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే త్రిముఖ పోటీ ఉంటుందని, మెజార్టీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తో ద్విముఖ పోటీయే ఉంటుందని భావిస్తోంది. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు గులాబీ నేతలు. కాంగ్రెస్ రాష్ట్ర, జాతీయ నేతల పర్యటనలు, ప్రచార కార్యక్రమాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టి హస్తం వ్యూహాలను తిప్పికొట్టే ప్లాన్ చేస్తోంది కారు పార్టీ.

అసెంబ్లీ ఎన్నికల్లో వ్యూహాలకు పదును పెడుతోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ టార్గెట్ గా అస్త్రాలను సిద్ధం చేస్తోంది. మళ్లీ గెలవాలంటే కాంగ్రెస్ ను కట్టడి చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇదే సమయంలో కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికలను చావోరేవో అన్నట్లు పరిగణిస్తోంది. దీంతో క్షేత్రస్థాయి నుంచి దూకుడు పెంచుతోంది హస్తం పార్టీ. కాంగ్రెస్ వ్యూహాన్ని పసిగట్టిన కారు పార్టీ క్షేత్రస్థాయిలోనే కాంగ్రెస్ జోరుకు కళ్లెం వేసేలా రివర్స్ అటాక్ చేస్తోంది.

Also Read : ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ పార్టీలోకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

కొన్ని రోజులుగా హస్తం పార్టీ నేతలపై ముప్పేట దాడి చేస్తున్నారు గులాబీ నేతలు. రాహుల్, ప్రియాంక సహా రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా విమర్శలు ఎక్కుపెడుతున్నారు. రాష్ట్రంలో రాహుల్, ప్రియాంక పర్యటన తర్వాత గులాబీ దళం మొత్తం కాంగ్రెస్ అగ్రనేతలకు కౌంటర్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా మంత్రులు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత తదితరులు రాహుల్ పర్యటనపై విమర్శలు చేశారు. సోనియాను బలిదేవతతో పోల్చిన గులాబీ దళం రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని నిలదీస్తున్నారు కారు పార్టీ నేతలు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు.

కర్నాటకలో ఇచ్చిన హామీలతో అధికారం దక్కించుకున్నట్లుగా తెలంగాణలోనూ గెలవాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు చెక్ చెప్పేలా పావులు కదుపుతోంది బీఆర్ఎస్. కర్నాటకలో విద్యుత్ ఆందోళనలను ప్రజలకు వివరించాలని నిర్ణయించింది. పొరుగు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే హామీలకు తిలోదకాలు ఇస్తున్న విషయాన్ని ప్రచారం చేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్. కర్నాటకలో ఎప్పటిప్పుడు సమాచారం సేకరిస్తున్న బీఆర్ఎస్.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఇబ్బందులు కోరి తెచ్చుకున్నట్లేనని ప్రజలకు తెలియజేయాలని ప్రత్నిస్తోంది బీఆర్ఎస్.

Also Read : బండి సంజయ్ సంచలన నిర్ణయం? ఇక రాజకీయ సన్యాసం?

ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారు రాష్ట్రంలో పర్యటించినా పెద్దగా పట్టించుకోని బీఆర్ఎస్.. కాంగ్రెస్ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా కనిపిస్తోంది. ఆ పార్టీ ప్రతి కదలికను గమనిస్తున్న కారు పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఛాన్స్ లేకుండా చేయాలన్న వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు చెబుతున్నారు.