Telangana : శాసనమండలిలో ఖాళీలు, పదవులపై కన్నేసిన నేతలు

తెలంగాణ శాసనమండలిలో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా మరో స్థానం ఖాళీ అయ్యింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ఏడు సీట్లు ఖాళీ అయినట్లయ్యింది. ఈ నెలలోనే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం విశేషం. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయాల్సి ఉంది.

Telangana : శాసనమండలిలో ఖాళీలు, పదవులపై కన్నేసిన నేతలు

Telangana Govt To Conduct Election For 7 Mlc Positions

Telangana MLC Election : తెలంగాణ శాసనమండలిలో ఖాళీల సంఖ్య పెరుగుతోంది. కొత్తగా మరో స్థానం ఖాళీ అయ్యింది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరెడ్డి పదవీకాలం ముగిసింది. దీంతో ఏడు సీట్లు ఖాళీ అయినట్లయ్యింది. ఈ నెలలోనే ఏడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కావడం విశేషం. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేయాల్సి ఉంది. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌తో.. ఎన్నికల నిర్వహణపై తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఈసీ తేల్చి చెప్పింది.

దీంతో ఆరు స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు ఆశావహులు. ఈలోగా టికెట్‌ కన్‌ఫర్మేషన్‌ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంతలో గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీ స్థానం ఒకటి ఖాళీ అవడంతో..ఈ స్థానంపై కూడా కన్నేశారు ఆశావహులు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవి …కేసీఆర్‌ నిర్ణయించే నేతకే దక్కనుంది. దీంతో ఎవరిని ఛాన్స్ వరిస్తుందోనని గులాబీనేతల్లో చర్చ మొదలైంది. ఇటీవల పదవీకాలం ముగిసిన నేతల్లో ఎవరినైనా గవర్నర్‌ కోటాలో పెద్దల సభకు పంపిస్తారన్న ప్రచారం టీఆర్‌ఎస్‌లో జోరందుకుంది. ఈ రేసులో ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.

మండలి మాజీ ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ నెల మొదటివారంలోనే గుత్తా…ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తయ్యింది. దీంతో ప్రోటెం ఛైర్మన్‌గా భూపాల్‌రెడ్డిని నియమించారు సీఎం కేసీఆర్‌. మరోసారి సీనియర్‌ నేత గుత్తా సుఖేందర్‌రెడ్డికి ఛాన్స్ ఇస్తారన్న చర్చ గులాబీదళంలో నడుస్తోంది. మరోవైపు రేస్‌లో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరు వినిపిస్తోంది. గవర్నర్‌ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని కడియం శ్రీహరి …పార్టీ అధినేత కేసీఆర్‌ను ఇటీవల కోరినట్లు తెలుస్తోంది.

ఇంతకీ ఈ రేసులో పదవీకాలం ముగిసిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌రెడ్డి లేరా అంటే ఆయన పేరు కూడా వినిపిస్తోంది. టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయ ఇన్‌ఛార్జ్‌గా సుదీర్ఘకాలం పనిచేస్తుండడంతో…తనకు మరోసారి గులాబీ బాస్ అవకాశం కల్పిస్తారనే ధీమాతో ఉన్నారు శ్రీనివాసరెడ్డి. ఏపీలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలు నాలుగు ఖాళీ అయితే ఇటీవల భర్తీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా గులాబీనేతలు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో తెలంగాణలోనూ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ ఖాళీని త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉందని ఓ టాక్‌ వినిపిస్తోంది.