Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే, కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి.

Rangareddy Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అక్కడికక్కడే మృతి

Road Accident (3)

Road Accident Three Died : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం గండిపేట మండలం ఖానాపూర్ వద్ద శంకర్ పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం దగ్గర ఆగ ఉన్న లారీని వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను అతి కష్టంతో కారులో నుంచి బయటికి తీశారు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. బాధితులందరూ నిజాంపేటకు చెందినవారిగా గుర్తించారు.

Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన లారీ

నిజాంపేటకు చెందిన దివ్యకు పెళ్లి నిశ్చయమైంది. దీంతో బ్యాచిలర్ పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి టిఫిన్ చేయడానికి కారులో నార్సింగి సీబీఐటీ నుంచి ఖానాపూర్ కు వెళ్లారు. తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి పోచమ్మ ఆలయం వద్ద నిలిచి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.

ప్రమాదం ధాటికి కారు నుజ్జు నుజ్జు అయింది. అయితే, కారులోని బెలూన్లు ఓపెన్ అయినప్పటికీ ముందు సీట్లలో కూర్చున్నవారి ప్రాణాలను అవి కాపాడలేకపోయాయి. తీవ్ర గాయాలపాలవ్వడంతో దివ్యతోపాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.