TRS Office : ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ భూమిపూజ కార్యక్రమానికి ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 2న కార్యాలయానికి భూమిపూజ చేయనున్నారు.

TRS Office : ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారు.

Trs Office

TRS Office :  దేశ రాజధాని ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో సెప్టెంబర్ 2న భూమి పూజ చేయనున్నారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తోపాటు.. మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు.

కాగా తెలుగు రాష్ట్రాల నుంచి తొలిసారి ఓ ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేస్తుంది. ఇక పార్టీ కార్యాలయం కోసం కేంద్ర ప్రభుత్వం 2020 అక్టోబర్ 9న 1100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది.

పార్టీ కార్యాలయ స్థలం కోసం టీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి 20 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా వార్షిక అద్దెగా రూ.20 లక్షలు చెల్లించనుంది. ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేసి కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.