Warangal : టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం..కావాలనే నిప్పు పెట్టారా? కుట్రకోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు

వరంగల్ ధర్మారం టెస్కో గోదాంలో అగ్నిప్రమాదంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? దీంట్లో కుట్రకోణం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు.

Warangal : టెస్కో గోదాంలో అగ్నిప్రమాదం..కావాలనే నిప్పు పెట్టారా? కుట్రకోణం ఉందని అనుమానిస్తున్న పోలీసులు

Fire Accident Warangal Dharmaram Tesco Godown

fire acciden warangal dharmaram tesco godown : వరంగల్ జిల్లా ధర్మారంలో ప్రభుత్వం టెక్స్‌టైల్‌ గోదాంలో (టెస్కో గోదాం) జరిగిన అగ్నిప్రమాదం విషయంలో పోలీసులు పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ సరఫరా లేని గోదాంలో మంటలు చెలరేగటం ఏంటీ అని అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో కుట్రకోణం ఉందా?ఎవరైనా కావాలనే ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? లేదా ఎవరైనా సిగిరెట్ కాల్చిపారేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అధికారులు వస్త్రాలు నిల్వ చేసే గోదాంలో ఫైర్ సేఫ్టీని పట్టించుకోకపోవటం వల్లే ఈ ఘటన జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రమాదశాత్తు అగ్నిప్రమాదాలు జరిగితే పరిస్థితి ఏంటీ? ఎలా నిలువరించాలి? అనే కోణంలో ఆలోచిస్తే భారీగా వస్త్రాలు నిల్వ చేసే గోదాం వద్ద నీటి సంపు కూడా లేకపోవటం వంటి పలు వైఫల్యాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనా ప్రభుత్వం టెక్స్‌టైల్‌ గోదాంలో (టెస్కో గోదాం) జరిగిన అగ్నిప్రమాదం విషయంలో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Also read : Warangal : టెస్కో గోదాంలో ఫైర్ ఆక్సిడెంట్.. రూ. 40 కోట్లు బూడిద

వరంగల్ జిల్లా ధర్మారం ప్రభుత్వం టెక్స్‌టైల్‌ గోదాంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటనలో 4 ఫైరింజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు 10 గంటలు తీవ్రంగా ప్రయత్నించినా అదుపులోకి రాని పరిస్థితి. మంటల వేడికి గోదాం గోడలు సైతం కూలిపోయాయి.

ఈ గోదాంలో విద్యార్ధులకు అందచేసే చేనేత దుస్తులను నిల్వ చేస్తుంటారు. వీటిని పాఠశాలలకు పంపించాల్సి ఉంటుంది. కానీ.. ఇటీవలి కాలంలో కరోనా విజృంభించడంతో పాఠశాలలు మూసివేశారు. దీంతో గోదాంలోనే ఆ వస్త్రాలు ఉండిపోయాయి. సోమవారం సాయంత్రం 6 గంటలకు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దుస్తులు కావడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. వాచ్ మెన్ సమాచారం ఇవ్వడంతో గోదాం ఇన్‌ఛార్జి శ్రీనివాస్‌, డీఎంవో శ్రీనివాస్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదం వల్ల.. రూ .40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు పలు రకాల అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. దర్యాప్తు ముమ్మరం చేశారు.