Hyderabad : హైదరాబాద్ లో కిలాడీ లేడి.. 18 ఏళ్లలోపు యువకులే టార్గెట్

ప్రేమపేరుతో యువకులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి వ్యవహారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఒక వివాహిత, 18 ఏళ్లలోపు యువకులు టార్గెట్ గా చేసుకొని ప్రేమపేరుతో మోసం చేస్తుంది.

Hyderabad : హైదరాబాద్ లో కిలాడీ లేడి.. 18 ఏళ్లలోపు యువకులే టార్గెట్

Hyderabad

Hyderabad : ప్రేమపేరుతో యువకులను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి వ్యవహారం హైదరాబాద్ లో వెలుగు చూసింది. కేరళ నుంచి హైదరాబాద్ కి వచ్చిన ఒక వివాహిత, 18 ఏళ్లలోపు యువకులు టార్గెట్ గా చేసుకొని ప్రేమపేరుతో మోసం చేస్తుంది. ఆమె చేతిలో మోసపోయిన వారు హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై హెచ్ఆర్సీ స్పందించింది. నవంబర్ 10లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాచకొండ సీపీని ఆదేశించింది హెచ్ఆర్సీ.

18 ఏళ్ల యువకులను ఈ కిలాడీ లేడి టార్గెట్ చేస్తున్నట్లు బాధితులు చెబుతున్నారు. ప్రేమ పేరుతో బుట్టలో వేసుకొని పెళ్లి చేసుకుంటానని నమ్మించి వాట్సాప్ లో సందేశాలు పంపి.. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతుందని బాధితులు వాపోయారు. చాటింగ్ పోలీసులకు చూపించి ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగుతుందని తెలిపారు. అమాయకుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు బాధితులు పేర్కొన్నారు. నగరంలో పదిమందికే పైనే ఈ కిలాడీ లేడి చేతిలో మోసపోయారని బాధితుడి తండ్రి మీడియాకు వివరించాడు.

అనేక మందిపై సదరు మహిళ కేసులు కూడా పెట్టిందని వాపోయారు. పిల్లలను జాగ్రత్తగా పెంచాలని.. ఇటువంటి కిలాడీ లేడిల చేతిలో పడి ఆత్మహత్యలు కూడా చేసుకునే అవకాశం ఉందని.. పిల్లలు ఎం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలని బాధితుడి తండ్రి తెలిపారు. కాగా హైదరాబాద్ లో గతంలో కూడా ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. పెళ్లి పేరుతో ఓ యువతి సుమారు 50 లక్షలు దోచుకుంది. ఒకరిద్దరిని కాదు పదుల సంఖ్యలో మోసం చేసింది. చివరకు ఆ యువతి పోలీసులకు చిక్కించి.