YS Sharmila-MLC kavitha : ఇక్కడ బతుకమ్మ..అక్కడ అట్లతద్ది..లిక్కర్ స్కామ్ సంపాదన సరిపోలేదా? : కవితపై షర్మిల సెటైర్
లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల మరోసారి తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితమ్మ తెలంగాణ పరువు తీశారని..తెలంగాణ బతుకమ్మ అంటూ హల్ చల్ చేసిన కవిత బతుకమ్మ ఆటలు ఆడి బతుకమ్మ పూలను ప్రజల చెవిలో పెట్టారంటూ ఎద్దేవా చేశారు షర్మిల.
YS Sharmila-MLC kavitha : లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై వైఎస్ షర్మిల మరోసారి తనదైనశైలిలో విమర్శనాస్త్రాలు సంధించారు. లిక్కర్ స్కామ్ లో ఉన్న కవితమ్మ తెలంగాణ పరువు తీశారని..కవితిబతుకమ్మను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని గొప్పలు చెప్పుకునే కవితమ్మ లిక్కర్ స్కామ్ లో గిలగిలలాడుతున్నారు..అలా తెలంగాణ పరువు తీసింది చాలక పక్క రాష్ట్రాల్లో అట్లతద్ది చేస్తదట అంటూ వైఎస్ షర్మిల ఎద్దేవా చేశారు. బతుకమ్మ అంటూ హల్ చల్ చేసిన కవిత బతుకమ్మ ఆటలు ఆడి బతుకమ్మ పూలను ప్రజల చెవిలో పెట్టారంటూ ఎద్దేవా చేశారు షర్మిల.
ఓ మహిళ అయి ఉండి లిక్కర్ మాఫియాలో కోట్ల రూపాయలు సంపాదించి…తెలంగాణలో ఆమె చేసిన ఘనకార్యాలు చాలవు అన్నట్లుగా ఇప్పుడు ఆమెగారు పక్క రాష్ట్రాల్లో అట్లతద్దులు చేస్తారట అంటూ విమర్శించారు. కవిత కేసీఆర్ బిడ్డ కాకపోతే ఆమెకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండేదా? తెలంగాణ ఉద్యమ పార్టీ అంటూ టీఆర్ఎస్ ను మొత్తం కుటుంబ పార్టీగా మార్చేశారు అంటూ విమర్శించారు షర్మిల. మహిళ అయి ఉండి లిక్కర్ మాఫియాలో కోట్ల రూపాయలు సంపాదించింది చాలక ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో ఇంకెంత సంపాదించటానికి బయలుదేరావమ్మా కవితమ్మా అంటూ షర్మిల సెటైర్లు వేశారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై..
ఈ సందర్భంగా షర్మిల బీఆర్ఎస్ పార్టీపై కూడా విమర్శలు చేశారు. బీఆర్ఎస్ అంటే బందిపోటు రాష్ట్ర సమితి అంటూ సెటైర్లు వేశారు.కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ భారీ అవినీతికి పాల్పడ్డారని కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం అంటూ విమర్శించారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ రూ. 70,000 కోట్ల నిధులను స్వాహా చేశారని విమర్శించారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల.
It’s Bandit’s Rashtra Samiti, not Bharat Rashtra Samithi. He’s (KCR) richest bandit in country as he’s involved in Kaleshwaram corruption&Kaleshwaram project is India’s biggest scam today as he syphoned off Rs 70,000 Cr of funds from financial institutions:YSRTP Chief YS Sharmila pic.twitter.com/hoRQwPpBaF
— ANI (@ANI) December 14, 2022