షర్మిల క్వశ్చన్ అవర్, నేతలు – అభిమానులకు ప్రశ్నలు

షర్మిల క్వశ్చన్ అవర్, నేతలు – అభిమానులకు ప్రశ్నలు

YSR Sharmila : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఏర్పాటుకు వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. పలు జిల్లాల పార్టీలకు చెందిన నేతలు, అభిమానులతో ఆమె ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పాటు, తదితర అంశాలపై కూలకుంషంగా చర్చిస్తున్నారు. తాజాగా..2021, ఫిబ్రవరి 20వ తేదీ శనివారం ఉదయం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారితో సమావేశమయ్యారు. కేవలం 300 మంది కీలక నేతలతో సమావేశం కావాలని అనుకున్నా..దాదాపు 500 మంది హాజరయ్యారని సమాచారం. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…

‘కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అన్నింటికీ అతీతంగా వైఎస్ రాజశేఖరరెడ్డి తెలుగు ప్రజలను ప్రేమించారు. రాజశేఖరరెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ప్రాణం పోయిందని తెలుసుకుని చనిపోయిన వారిలో తెలంగాణ వారు కూడా ఉన్నారు. రాజన్న సంక్షేమ పాలన ఇక్కడ రావాలని, తేవాలని నా కోరిక. మీరు తోడుంటే..అది సాధ్యమని నమ్మకం. మీ మీ ప్రాంతాల్లో మీకు తెలిసిన విషయాలు, టీఆర్ఎస్ పాలన ఎలా ఉంది ? పేద ప్రజలు సంతోషంగా ఉన్నారు ? మన వాళ్లు ఎలా ఉన్నారు ? మీ కుటుంబాలు ఎలా ఉన్నాయి ? తనకు తెలియచేయాలని సూచించారు.

షర్మిల అడిగిన ప్రశ్నలు ఇవే :
1. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటీ ?
2. అభిమానుల కష్టాలను ఏ విధంగా తీర్చాలి ?
3. మీ అసెంబ్లీ పరిధిలో వైఎస్ఆర్ చేసిన అభివృద్ధి పనులు ఏంటీ ?
4. రాజకీయ నిర్ణయంపై సామాన్యులు ఏమనుకుంటున్నారు ?
5. టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ని ఎలా ఎదుర్కొవాలి ?

6. మీరు ఇచ్చే సలహాలు ఏంటీ ?
7. తెలంగాణలో బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలి ?
8. బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలంటే..పోరాడాల్సిన అంశాలు ఏంటీ ?
9. సంస్థాగతంగా బలపడడానికి క్యాడర్ నిర్మాణానికి చేయాల్సిన పనులు ఏంటీ ?
10. వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావాలంటే..మీరు ఇచ్చే సలహాలు ఏంటీ ?
11. తెలంగాణలో వైఎస్ఆర్ అభిమానులు ఎదుర్కొంటున్న కష్టాలు ఏంటీ ?