Kisan Agri Show 2024 : హైదరాబాద్లో అతిపెద్ద ‘కిసాన్ అగ్రి షో 2024’.. ఎప్పటినుంచి ఎప్పటివరకంటే?
Kisan Agri Show 2024 : హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను నిర్వహించనున్నారు. రైతులు, పాలసీ మేకర్లు, వ్యవసాయరంగ నిపుణులు తదితర ఔత్సాహికులందరూ ఒకే వేదికపైకి హాజరుకానున్నారు. వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొనసాగనుంది.
Telangana Largest Agri Show KISAN 2024 : తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయ ప్రదర్శన ‘కిసాన్ అగ్రి షో 2024’ (2వ ఎడిషన్) కోసం హైదరాబాద్ రెడీ అవుతోంది. హైటెక్స్ (HITEX) ఎగ్జిబిషన్ సెంటర్లో ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రైతులు, పాలసీ మేకర్లు, వ్యవసాయరంగ నిపుణులు తదితర ఔత్సాహికులందరూ ఒకే వేదికపైకి హాజరుకానున్నారు. వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు మొత్తం 3 రోజుల వ్యవసాయ ప్రదర్శన కొనసాగనుంది.
Read Also : Pulses Cultivation : వేసవి అపరాల సాగులో మెళకువలు – అధిక దిగుబడులకు చేపట్టాల్సిన మేలైన యాజమాన్యం
నూతన విధానాలతో వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చనుంది. 2024 ఏడాదిలో ‘కిసాన్ అగ్రి షో 2024’ను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించనున్నారు. 12వేల చ.మీ విస్తీర్ణంలో విస్తరించిన అతిపెద్ద వేదికలో ఈ ఎగ్జిబిషన్ ప్రదర్శన జరుగనుంది. ఈ సందర్భంగా దాదాపు 140పైగా కంపెనీలు ప్రదర్శనలో భాగం కానున్నాయి. వ్యవసాయంలోని లేటెస్ట్ ప్రొడక్టులు, వినూత్న పద్ధతులను ప్రదర్శించనున్నారు.
వేలాది మంది సందర్శకులు వచ్చే అవకాశం :
హైదరాబాద్ నగరంలో జరిగిన మొదటి ఎడిషన్ కిసాన్ అగ్రి షో విజయవంతం కాగా.. రెండవ ఎడిషన్ కోసం తెలంగాణ రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి 140 కన్నా ఎక్కువ మంది ఎగ్జిబిటర్లు, 20వేలకు పైగా సందర్శకులు వస్తారని అంచనా. వ్యవసాయ సంబంధిత అన్ని రంగాల నుంచి మొదటి ఎడిషన్కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ ప్రదర్శనలో భాగమైన అనేక కంపెనీలకు, రైతులకు అత్యంత ప్రయోజనకరంగా మారింది.
ఎగ్జిబిటర్లకు వినూత్న ప్రొడక్టులు, సర్వీసులను ప్రదర్శించేందుకు కిసాన్ హైదరాబాద్ 2024 మహోన్నత వేదికను రూపొందించింది. ఈ వేదికలో పరిశ్రమలోని లేటెస్ట్ అప్డేట్స్ గురించి చర్చించడానికి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేయనుంది. ప్రగతిశీల రైతులంతా ఈ అగ్రి ఎగ్జిబిషన్లో కలవనున్నారు. రైతుల అనుసంధానంతో విజ్ఞాన మార్పిడికి ప్రధాన అవకాశంగా మారింది. ఈ వేదికలో తెలంగాణ హార్టికల్చర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతులకు నాలెడ్జ్ సెషన్స్ అందించడం కోసం ఏకకాలిక సదస్సును కూడా నిర్వహిస్తోంది.
కిసాన్ ఎగ్జిబిషన్ ఫార్మ్ మెషినరీ, వాటర్ అండ్ ఇరిగేషన్, ప్లాస్టికల్చర్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్, ఐఓటీ ఇన్ అగ్రికల్చర్, కాంట్రాక్ట్ ఫార్మింగ్పై దృష్టిపెట్టనుంది. రైతులకు ఆసక్తి ఉన్న విషయాలను గుర్తించడంలో ఈ ప్రదర్శన సాయపడనుంది. ఈ వేదికలోని ఓపెన్ అరేనాలో అతిపెద్ద ట్రాక్టర్లు, అగ్రి మెషినరీ వంటి వ్యవసాయ అప్లియన్స్స్ కూడా ప్రదర్శించనున్నారు.
Read Also : Tribal Rabi Paddy : రబీ వరిలో సమగ్ర కలుపు, ఎరువుల యాజమాన్యం